జగన్ ప్రాదాన్యత దేనికో?

Publish Date:May 6, 2014

Advertisement

 

జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అవగానే ఐదు సంతకాలు చేస్తానని జనాలను ఒకటే ఊదరగొట్టారు. అంతేకాక ప్రజలకు చెప్పినవి, చెప్పనివి కూడా చాలా పనులు చేస్తానని ప్రకటించారు. బహుశః ప్రజలకు చెప్పని వాటిలో తనపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడం కూడా ఒకటేమో! ఈ ఎన్నికలలో వైకాపా, గెలిచినా ఓడినా ఆయన తన తలపై కత్తిలా వ్రేలాడుతున్న సీబీఐ, ఈడీ కేసులు మాఫీ చేయించుకోవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తారని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందుకే ఆయన మొదటి నుండి కూడా తనకు 30 యంపీ సీట్లు కావాలని ప్రజలను గట్టిగా కోరుతున్నారు. ఒకప్పుడు సమైక్య ఉద్యమాలు జోరుగా నడుస్తున్నవేళ తనకు 30 యంపీ సీట్లు ఇచ్చినట్లయితే, రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడుతానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత జరిగే ఎన్నికలలో 30 సీట్లు వచ్చినా అదెలా సాధ్యమో ఆయన ఏనాడు వివరించలేదు. ఎవరూ ఆయనని అడగలేదు కూడా. ఇక ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక, జగన్ తన 30 యంపీ సీట్ల పాట పల్లవి, స్వరం కూడా మార్చి, ఇప్పడు వాటిని కేంద్రానికి ఎరగా వేసి దాని మెడలు వంచి నిధులు తీసుకువస్తానని గర్జించారు. తన తండ్రిపై ప్రజలలో ఉన్న సానుభూతిని పెట్టుబడిగా పెట్టి, రాష్ట్రంలో అధికారం, ముఖ్యమంత్రి పదవి, 30యంపీ సీట్లు సంపాదించుకోవాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి, ఒకవేళ ప్రజలు తనకి 30 యంపీ సీట్లు గనుక ఇచ్చినట్లయితే మళ్ళీ వాటిని పెట్టుబడిగా పెట్టి తన కేసుల నుండి విముక్తి పొందాలని ప్రయత్నిచడం తధ్యం. ఒకవేళ బీజేపీ/ఎన్డీయే కూటమి 272 యంపీ సీట్లు గెలుచుకోగలిగి, బయట పార్టీల మద్దతు ఆవసరం పడకపోయినట్లయితే, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కోర్టు గడపలు ఎక్కక తప్పదు.

By
en-us Political News

  
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.