అతను జట్టులో ఉంటే ఏదో విధంగా గెలుస్తామన్న నమ్మకం కలుగుతుంది, అతను జట్టులో ఉంటే ప్రత్యర్ధి బ్యాటర్ ఇబ్బంది పడతాడు, అతను ఫీల్డింగ్ చేస్తుంటే ఫోర్లు ఆగిపోతాయి, సిక్స్లకు అవకాశం ఉండదు. అతను బౌలర్గా బ్యాటర్ను ముప్ప తిప్ప లు పెట్టగలడు. భారత్ క్రికెట్ జట్టుకు అతను ఎంతో వెన్నుదన్ను. అతనే రవీంద్ర జడేజా అనే జద్దు!
అతని కుడిమోకాలికి గాయమయింది. శస్త్రచికిత్స అనివార్యమైంది. అందుకే ఆసియాకప్ మిగతా మ్యాచ్లకు దూరమ య్యాడు. అతను త్వరలో జట్టులోకి తిరిగి రావాలని, ఫైనల్ లో భారత్ను గెలిపించే భారత్ స్టార్స్లో అతని పాత్ర కీలకమని అందరూ ఎంతో ఆశించారు. కానీ శస్త్రచికిత్స తప్పనిసరి కావడంతో అతను కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు అన్నారు. ప్రస్తుత ఆసియాకప్కి అలా దూరమయ్యాడు. కానీ ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్నకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇది జడేజా వీరాభిమానులను బాధిస్తోంది.
ఆసియా కప్లో పాకిస్థాన్, హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లలో జడేజా మెరుగైన ప్రదర్శనతో జట్టులో సమతూకం తీసుకు వచ్చా డు. ఇలాంటి ఆటగాడు ప్రపంచకప్ టీమ్లో లేకపోనుండడం రోహిత్ అండ్ కోకు పెద్ద దెబ్బగానే చెప్పుకోవాలి. టీమ్ ఇండియా కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కుడి మోకాలి నొప్పితో బాధపడుతూ ఆసియా కప్టోర్నీకి దూరమయ్యాడు స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా. అతడి అంతర్జాతీయ పునరాగమనం గురించి ఎన్సీఏ వైద్య బృందం స్పష్టత ఇవ్వలేదు. రానున్న మూడు నెలలు అతడు క్రికెట్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని బీసీసీఐ సీనియర్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు.
అయితే.. ప్రపంచకప్కు ఇంకా చాలా సమయం ఉందని.. జడేజాపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని స్పష్టం చేశాడు టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొన్నాడు.ఆసియా కప్లో మొదటి రెండు మ్యాచ్ల తర్వాత మోకాలి గాయం కారణంగా అతడు ఈ టోర్నీకి దూరమయ్యాడు. పాకిస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్కు అవకాశం రాకపోయినా..బౌలింగ్లో కీలక వికెట్ తీశాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఉత్తమ సేవలందించే ఈ స్టార్ ఆల్రౌండర్ పెద్ద టోర్నీకి దూరమవడం టీమ్ఇండియాకు పెద్దలోటే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jadeja-may-not-be-available-for-world-t20-25-143197.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.