Publish Date:Oct 19, 2022
కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్ల సేవను గుర్తించి పార్టీ అధ్యక్షపదవిని కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త అద్య క్షునిగా ఎన్నికయిన మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధినేత సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్క్షతలు చెప్పారు. ఆమె నాయకత్వంలో కేంద్రంలో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చామని అన్నారు. రాజ్యసభ ఎంపీగా పార్టీ తరఫున సభలో గళం వినిపించిన ఖర్గే పార్టీ అద్యక్షపదవి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల అధారిటీ చైర్మన్ మధుసూదన మిస్త్రీ ఖర్గేను విజేత గా ప్రకటించారు. పార్టీ అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికలో మొత్తం 9,385 ఓట్లు పడగా, ఆయనకు 7,897 ఓట్లు, థరూర్కి 1,072 ఓట్లు వచ్చాయన్నారు. 416 ఓట్లు చెల్లలేదు.
అధ్యక్షునిగా ఈ నెల 26వ తేదీన పూర్తి బాధ్యతలు స్వీక రిస్తారు. ప్రస్తు తం భారత్ జోడో యాత్రలో ఉన్న పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఖర్గే కు శుభాకాంక్షలు తెలిపారు. తనతో పార్టీ పదవికి పోటీపడిన శశి థరూర్ని కలిసి పార్టీని విజయపథంలోకి తీసికెళ్లడానికి అనేక అంశాలను చర్చిం చానని ఖర్గే అన్నారు. పార్టీ కార్య కర్తలుగా అందరం కలిసి పనిచేయాలని, పార్టీలో ఎవరు పెద్ద, చిన్నాలేరన్నారు. అందరం ఐక మత్యం తో దేశంలో మతమౌఢ్యంతో రెచ్చిపోతున్న శక్తులను అడ్డుకోవాలన్నారు.
ఈనెల 17వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం ఆయా రాష్ట్రాల నుంచి బ్యా లెట్ పెట్టెలను న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంట లకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన పోలింగ్లో అక్రమాలు జరిగాయని శశి థరూర్ వర్గం ఆరోపించింది. కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లింది. లక్నోలో లేని డెలిగేట్ల ఓట్లు పోలయ్యాయని, యూపీ నుంచి పోలైన అన్ని ఓట్ల ను చెల్లనివిగా పరిగణించాలని కోరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/its-all-her-gracekharge-39-145719.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.