Publish Date:Oct 19, 2019
చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం వద్ద ఉన్న కల్కి ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వెల్లస్ కోర్సుల పేరుతో కల్కి ఆశ్రమంలో భారీగా విరాళాలు సేకరించినట్టుగా అధికారులు గుర్తించారు. తాత్విక,ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీ భక్తులకు ఎరవేశారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకూ 43.9 కోట్ల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.అందులో పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన యూఎస్ డాలర్లు,ఇరవై ఆరు కోట్ల విలువైన ఎనభై ఎనిమిది కిలోల బంగారం,ఐదు కోట్ల విలువైన వజ్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా, అమెరికా,యూఏఈ,సింగపూర్ లో నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు అధికారులు.
చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం,చెన్నై, హైదరాబాద్,బెంగళూరులో నలభై ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి.ఆంధ్రా,తమిళనాడులో భారీగా భూములు కొన్నట్టుగా అధికారులు గుర్తించారు.నలభై చోట్ల ఇప్పటికే సోదాలు నిర్వహించినటువంటి ఐటీ బృందాలు పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటూ ఆశ్రమంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే పసిగట్టిన పరిస్థితి కనిపిస్తోంది.ఈ నేపథ్యం లోనే దాదాపుగా ఇన్కం ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి యాక్ట్ కి సంబంధించినటువంటి దాడులు కొనసాగుతున్నాయని నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ప్రకటన ప్రకారమే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల మేర అక్రమంగానే ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు.పెద్ద ఎత్తున తాత్విక,ఆధ్యాత్మిక కోర్సుల పేరుతో విదేశీయుల్ని ఆకర్షించడం,పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, విరాళాలు సేకరించడం లాంటి పనులు చేశారని అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ విరాళాలను అక్రమ మార్గంలో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్టుగా స్పష్టంగానే ఇప్పటికే ఐటి శాఖ బృందాలు తేల్చి చెప్పాయి.మరోవైపు నాలుగో రోజు సోదాల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ అలాగే కన్స్ట్రక్షన్ విభాగాల్లో పెద్ద ఎత్తున విదేశాల్లో కూడా పెట్టుబడులు ఆశ్రమ నిధులు అక్కడ పెట్టినట్లుగా గుర్తించిన అధికారులు వీటి లెక్కలను బయట పెట్టనున్నట్లు తెలియజేశారు.ఏ రకంగా నిధులను తప్పుదోవ మళ్ళించారన్న దానిపైనా కల్కి ఆశ్రమ నిర్వాహకులను అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-raids-on-kalki-bhagwan-properties-25-90346.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.