హైదరాబాద్లో భారీగా బంగారు ఆభరణాలు ధరించి ప్రజల్లో తిరుగు తున్న వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించారు. ఇటీవల వరుసగా గోల్డ్ మాన్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.ఇంతకుముందు కొండ విజయ్ కుమార్ వద్ద అధికారులు భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకోగా, మరో కేసులో సూర్య భాయ్ ధరించిన ఆభరణాల్లో ఎక్కువ భాగం కోటెడ్ లేదా రోల్డ్ గోల్డ్ గా తేలిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి ఐటీ అధికారుల వలలో చిక్కాడు. నగరానికి చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భారీగా బంగారు ఆభరణాలు ధరించి సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ ఉండటంతో చిన్న పహిల్వాన్పై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. టీవీ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలించిన తర్వాత విచారణ ప్రారంభించింది. విచారణలో అతని వద్ద 900 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించి, అందులో 700 గ్రాముల బంగారు ఆభరణాలకు సరైన లెక్కలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుంది. వ్యక్తిగత వినియోగానికి చెందిన 150–200 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం–2025లోని సెక్షన్ 247 కింద జారీ చేసిన తొలి వారెంట్ ఇదే కావడంతో ఈ కేసు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
స్వాధీనం చేసిన బంగారం అద్దె ఆదాయం, భూముల కొనుగోలు–అమ్మకాల ద్వారా వచ్చిందని చిన్న పహిల్వాన్ చెప్పినా, సరైన ఆధారాలు చూపలేకపోయినట్లు అధికారులు తెలిపారు. ఐటీ రిటర్నుల్లో కూడా తక్కువ ఆదాయం మాత్రమే చూపినట్లు వెల్లడించారు. భూములను జీపీఏలపై కొనుగోలు చేసి, అధిక ధరకు మళ్లీ అమ్మి నగదు రూపంలో లాభాలు పొందినట్టు విచారణలో గుర్తించినట్లు సమాచారం.కుటుంబ సభ్యుల ఆర్థిక వ్యవహారాలపై కూడా అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. ఒక కుటుంబ సభ్యుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు హాస్టల్ వ్యాపారం ద్వారా ఆదాయం చూపించినట్లు తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-raids-in-hyderabad-36-216627.html
ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నూజివీడు పోలీసులు, గుజరాత్ వెళ్లి మరీ అరెస్టు చేశారు.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది.
యాపిల్ ప్లాట్ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్టాప్ GPU కాంబినేషన్తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్తో వచ్చిన ఈ పవర్ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.