Publish Date:May 26, 2022
హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం మధ్యాహ్నం చేసిన ట్వీట్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐఎస్బీని ఎక్కడ నెలకొల్పాలన్న విషయంపై సమాలోచనలు చేస్తున్న ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డును తాను హైదరాబాద్లోనే ఆ సంస్థను ఏర్పాటు చేసేలా ఒప్పించిన తీరుపై చంద్రబాబు గురువారం వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఆ ట్వీట్లలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి)ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసే విధంగా ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఒప్పించేందుకు తానేం చేశానో చంద్రబాబు ఆ ట్వీట్లలో సవివరంగా చెప్పుకోచ్చారు. అప్పటికే హైదరాబాద్ కంటే ఎంతో అభివృద్ధి చెందిన బెంగళూరు, చెన్నై, ముంబైలలో ఏదో ఒక నగరంలో ఐఎస్ బీ ఏర్పాటు చేయాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, ఇక ప్రకటనే తరువాయి అని అంతా భావిస్తున్న సమయంలో తాను హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటుకు ప్రతిపాదించాననీ, ముఖ్యమంత్రి హోదాను మరచి ఐఎస్ బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ను స్వయంగా కలిసి వారిని తన ఇంటికి ఆహ్వానించాననీ, వారికి స్వయంగా సర్వ్ చేశాననీ ఆ ట్వీట్ల లో చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలు వంటి అంశాలపై వారికి తన నివాసంలోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాననీ చంద్రబాబు పేర్కొన్నారు. ఐఎస్ బీ హైదరాబాద్ లో ఏర్పాటైతే.. హైదరాబాద్ రూపు రేకలే మారిపోతాయనీ తాను అప్పుడే ఊహించాననీ పేర్కొన్నారు.
ఇప్పుడు ఐఎస్ బీ ప్రపంచంలోనే మేటి విద్యా సంస్థగా హైదరాబాద్ కే కాకుండా దేశానికే గర్వకారణమైన సంస్థగా ఎదిగి నిలవడం గర్వంగా ఉంనీ చంద్రబాబు ట్వీట్లలో పేర్కొన్నారు. చంద్రబాబు ట్వీట్లపై ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, విద్యావేత్తలు, దిగ్గజ వ్యాపార సంస్థల అధినేతలూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ధ్యాంక్యే సీబీఎన్ ఫర్ ఐఎస్ బీ పేరిట హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ పొగడ్తలలో ముంచెత్తుతున్నారు. కేవలం చంద్రబాబు కారణంగానే తమ ప్రాంతానికి రావాల్సిన ఐఎస్బీ హైదరాబాద్కు వెళ్లిపోయిందని ముంబై, బెంగళూరుకు చెందిన ప్రముఖులు ట్వీట్లు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/isb-hyderabad-campous-an-evidence-for-cbn-visionary-39-136508.html
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల అరెస్ట్ సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.