రాష్ట్రంలో ప్రభుత్వం వుందా?

Publish Date:May 22, 2023

Advertisement

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో  కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా, కారా? ఆ కేసులో సహా నిదితునిగా ఉన్న ఆయనకు ఈ నేరంతో   సంబంధం వుందా, లేదా? అసలు, కేసేమిటి. ఎక్కడ మొదలైంది ఎన్ని మలుపులు తిరిగింది? ఇప్పడు ఇవేవీ ప్రధాన ప్రశ్నలు కాదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా, లేదా? అన్నదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. అవును  కర్నూల్  ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి  శ్రీ లక్ష్మి చికిత్స పొదుతున్న విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఈ ఉదయం నుంచి సాగుతున్న తమషా చూస్తే ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వుందా? పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అనే సందేహం కలగక మానదు.

 అవును హత్య కేసు విచారణ పూర్వాపరాలు ఇతర విషయాలను పక్కన పెట్టినా  ఇదేమిటి, కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరించక పోవడం ఏమిటి? అధికార పార్టీ నాయకులు , కార్యకర్తలు, చివరకు ఏమ్మేల్యేలు, మాజీలు అస్పుపత్రిని తమ నిర్భండంలోకి తీసుకుని, సామాన్య ప్రజలు, రోగుల రాకపోకలకు అంతరాయం కల్పించినా,  శాంతి భద్రతల సమస్య సృష్టించిన స్థానిక పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించడం దేనికి సంకేతం? ఈ పరిస్థతిని చూస్తే  రాష్ట్రంలో ప్రభుత్వం వుందా .. లేదా అనే సందేహం రాక మానదు.  

నిజానికి, వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అనేక నిందలు మోస్తూ కూడా ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి  ఇవ్వవలసిన  గౌరవం.. కాదు కాదు అంతకంటే ఎక్కువే ఇచ్చింది. ఒకసారి కాదు, అనేక మార్లు సీబీఐ విచారణకు హాజరు కాకున్నా, చూసీ చూడనట్లు వదిలేసింది. అనేక వెసులుబాట్లు కల్పించింది. ఉదారంగా వ్యవహరించింది.  చాలా చాలా లాంగ్ లాంగ్ రోప్ ఇచ్చింది. అయినా, ఆయన సహకరించక పోవడంతో అరెస్ట్ అనివార్యమని భావించిందో ఏమో కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకడుగు ముందుకు వేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావసిన గౌరవ ఎంపీ ఆఖరిక్షణంలో వారి తల్లి శ్రీ లక్ష్మి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేక పోతున్నానని  లేఖ రాశారు. అయితే ఆయన ఆఖరి క్షణంలో విచారణకు హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి కాదు, ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన ఇలాగే.. ఏవో కారణాలు చెప్పి విచారణకు హాజరు కాలేదు.

మరో వంక  సీబీఐ విచారణ నుంచి వెసులుబాటు పొందిన అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయినా ఎక్కడి కక్కడ ఆయనకు  చుక్కెదురవుతోంది. మరో వంక రాష్ట్ర పోలీసులు సహకరించని నేపధ్యంలో కేంద్ర బలగాల రక్షణలో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.. అదే జరిగితే రాష్ట్ర పోలీసు ప్రతిష్టే కాదు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కూడా మరింతగా దిగాజరుతుందని అంటున్నారు. అంతే కాదు  ఇటీవల హైదరాబాద్ లో మధ్య ప్రదేశ్ పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంఘటనను గుర్తు చేస్తూ, ఒక  ఎంపీని అదే తరహాలో కేంద్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగితే అది రాష్ట్రానికి తలవంపులుగా నిలిచి పోతుందని అంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.