ఉద్యోగులతో యుద్ధమే.. పీకే వ్యూహమే?

Publish Date:Jan 23, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల‌కు పైగానే సమయముంది. ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి, ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించారా? అందులో భాగంగానే రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అందుకేనా, ప్రభుత్వ ఉద్యోగులతో  యుద్దానికి సిద్దమవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. 

నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడం వల్లనే, ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీ, ఇతర ఆర్థిక సంబంధ విషయాలలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది అంటే, అందులో నిజం ఉన్నా లేకున్నా, కొంత వరకు అర్థం చేసుకోవచ్చును. అయితే అదే విషయాన్ని ఉద్యోగులతో చర్చించి, వారిని కూడా విశ్వాసంలోకి తీసుకుని తుదినిర్ణయం తీసుకుంటే అదో రకంగా ఉండేది. కానీ, అలాంటి ప్రయత్నం జరగలేదు. పైగా ఒక‌వంక చర్చలు అంటూనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 

నిజానికి ఇప్పుడు ప్రకటించిన పీఆర్సీ ఇప్పుడు ఇవ్వవలసింది కాదు. ఎప్పుడో ఇవ్వవలసింది. ఇవ్వలేదు. గత రెండున్నర మూడు సంవత్సరాలుగా 27 శాతం ఐఆర్ ఇచ్చి ప్రభుత్వం పీఆర్సీ వాయిదా వేస్తూ వచ్చినా ఉద్యోగులు కరోనా మహామ్మారి సృష్టించిన ఆర్ధిక,  అర్థికేతర సమస్యలను దృష్టిలో ఉంచుకునే, ‘పీఆర్సీ’,  ‘ఫిట్మెంట్’ కోసం పట్టు పట్టలేదు. 

అలాగే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవ్వవలసిన ఐదు  కరవు భత్యం కిస్తీలు ఆపినా ఉద్యోగులు ఆందోళనకు దిగలేదు. చివరకు ఉద్యోగులు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న సీపీఎస్ రద్దు హామీ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పినా, మడమ తిప్పినా ఉద్యోగులు తమ డిమాండ్’ను వినిపిస్తూ వచ్చారు కానీ, ఇచ్చిన మాట ఏమైందని ప్రభుత్వం కాలరు పట్టుకుని నిలదీయలేదు. 

ఇప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ (27 శాతం) కంటే ఫిట్మెంట్’ (23 శాతం) తక్కువ అయినా ఒపుకున్నారు . అయినా  హెచ్ఆర్ఏ ఇతర సమస్యల మీద చర్చలు జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం ఏక పక్షంగా రాత్రికి రాత్రి జీవోలు జారీ చేసి వివాదానికి శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా, సర్కార్ తీసుకున్న చీకటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యోగుల సిద్ధమవుతున్న వేళ వారితో చర్చలకు ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అయితే ఆ కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు మొదలు కాకముందే అర్థరాత్రి జీవోలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.

సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్న సమయంలో మంత్రులు ఫోన్ చేసి, చర్చలకు రమ్మని నాయకులను పిలిచారు. అయితే, అదే సమయంలో కొత్త జీవోల  ప్రకారమే జనవరి నెల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం మరో జీవో జారీచేసింది. అంటే, ఒక విధంగా ప్రభుత్వం ఉద్యోగులను అవమానపరిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందనే అనుమానాలకు ఆస్కారం కలిపిస్తోంది.   
అంతే కాదు, ప్రభుత్వం ఉద్యోగులతో యుద్దానికి కాలు దువ్వుతోందా అన్నట్లుగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించింది. ఇందుకు వలంటీర్లతోపాటు సోషల్‌ మీడియానూ విస్తృతంగా వాడుకుంటోంది. ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి. వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లండి. మన వాదన వినిపించండి’ అని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి  మంత్రివర్గ సహచరులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఉద్యోగులు కోరినట్లుగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తే, ఏదైనా పథకాన్ని ఆపాల్సి ఉంటుందని అందుకు ఈ ప్రభుత్వం  ఎప్పటికీ అంగీకరించదని స్వయంగా ముఖ్యమంత్రి అన్నట్లు వార్తలొచ్చాయి. అంటే, ఉద్యోగులను బూచిగా  చూపించి ప్రజలను, ముఖ్యంగా  పథకాల లబ్దిదారులను తమ వైపుకు తిప్పుకునేందుకు రాజకీయ కుట్ర పూరిత ఎత్తుగడను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని పరిశీలకులు అంటున్నారు. 

నిజానికి, ఒక్క విషయంలోనే కాదు, రాజదాని విషయంలో, సినిమా టికెట్ల వ్యవహారంలో, ఇతర విషయాల్లో కూడా సమాజంలోని వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా,ఈ  కుట్ర పూరిత ఎత్తుగడ వెనక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందనే అనుమానాలు కూడా వినవస్తున్నాయి.
 

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.