కేసీఆర్ మౌనం వ్యూహత్మకమేనా?

Publish Date:Jun 6, 2023

Advertisement

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే టార్గెట్‌తో టీఆర్ఎస్ పార్టీని కాస్తా బీఆర్‌ఎస్‌గా మార్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇటీవలి కాలంలో ఆయన  మౌనంపై  రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది.  ప్రతిపక్ష పార్టీల సీఎంలంతా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సమావేశం అయ్యేందుకు సన్నద్ధమౌతుంటే..  అసలు మోడీ వ్యతిరేకతే పునాదిగా జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

వాస్తవానికి ఇలాంటి సమావేశాన్ని కేసీఆర్ ముందుండి నిర్వహించాలి. కానీ అందుకు భిన్నంగా అసలు ఆయన హాజరవుతారా? లేదా?  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ది వ్యూహాత్మక మౌనం అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటే.. పరిశీలకులు మాత్రం వేరే విధంగా విశ్లేషణలు చేస్తున్నారు.  అవకాశం లేకపోయినా అవకాశాన్ని సృష్టించుకుని మరీ బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా విమర్శల తుటాలు కురిపించే కేసీఆర్ ఇటీవలి కాలంలో అసలు ఆ దిశగా గొంతు కూడా సవరించుకోవడం లేదు. ఏవైనా సభలూ సమావేశాలలో మాట్లాడినా, ఆయన విమర్శలన్నీ కాంగ్రెస్ పైనే ఉంటున్నాయి కానీ బీజేపీ ఊసు కానీ, ప్రధాని మోడీ మాట కానీ ఎత్తడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయానికి ఎంతో కీలకం అయినటువంటి కర్నాటక ఎన్నికలలో ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని అంతా భావించినప్పటికీ అసలా వైపునకే కన్నెత్తి చూడలేదు.  

రెండువేల నోట్ల రద్దు సందర్భంగానూ, కేజ్రీవాల్ స్వయంగా వచ్చి మద్దతు కోరినా ఆచితూచి స్పందించడం ద్వారానూ అసలు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారా? లేక మద్దతు పలుకుతున్నారా అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత  అరెస్ట్ ఖాయమంటూ జరిగిన ప్రచారం ఇప్పుడు జరగడం లేదు. అసలా కేసులో ఆమె ఆరోపణలు నిజంగా ఎదుర్కొన్నారా అన్నట్లుగా సీబీఐ, ఈడీలు మౌనం వహించాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మౌనం వెనుక ఆయన బీజేపీకి సరెండర్ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  మొత్తం మీద పార్టీ పేరు నుంచి తనకు అచ్చివచ్చిన తెలంగాణ పదాన్ని సైతం తొలగించి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి సిద్ధమైన కేసీఆర్ ఇప్పటికిప్పుడైతే  దేశ రాజకీయాల్లో  ఏకాకిగా మిగిలిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ ఏ వేదిక మీద నుంచి మాట్లాడినా  ఆ ప్రసంగ లక్ష్యం మాత్రం బీజేపీ, ప్రధాని మోడీ టార్గెట్ గానే ఉండేది. 

 తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని హెచ్చరించే వారు. అటువంటిది ఇటీవలి కాలంలో ఆయన బీజేపీని కానీ, ప్రధాని మోడీని కానీ పల్లెత్తు మాట అనడం లేదు. చివరాఖరికి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఆయన ప్రసంగంలో కూడా జాతీయ అంశాలను ప్రస్తావించలేదు. దీంతో ఆయన బీజేపీకి అనుకూలంగా.. స్టాండ్ తీసుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్  వర్గాల్లోనే  వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
అమాయ‌కమైన ముఖం పెట్టి అబ‌ద్ధాలను అల‌వోక‌గా చెప్ప‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మించిన రాజ‌కీయ నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైన‌.. సొంత చెల్లెళ్ల‌పైన‌కూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ దిట్ట.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఏప్రిల్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయద జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది.
మల్కాజ్ గిరి పై పట్టుకోసం మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు.
జగమెరిగిన కమేడియన్ అలీ.. ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు.
వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.