Publish Date:Oct 19, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను బీఆర్ఎస్ జాతీయ అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఢిల్లీకే పరిమితమౌతారని తెరాస వర్గాలలో చర్చ జరుగుతోంది.
ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు లభించిన నేపథ్యంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ మీడియాకే కాకుండా అంతర్జాతీయ మీడియాకు కూడా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం ఢిల్లీలో ఆయన బస చేసిన సమయంలోనే కవితను ఆ వ్యవహారాలన్నీ సమన్వయం చేయాల్సిందిగా ఆదేశాంచారని చెబుతున్నారు. ఇందుకోసమే ఇన్ఫర్మేషన్ కమిషనర్ అరవింద్ కుమార్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన సందర్భాన్ని పూర్తిగా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది. దేశం మొత్తంలో ఈ పురస్కారాలకు ఎంపిక అయిన ఏకైక ఇండియన్ సిటీ హైదరాబాద్ మాత్రమే కావడం గమనార్హం.
దేశంలోని నగరాలన్నిటినీ తోసి రాజని అంతర్జాతీయ అవార్డునకు హైదరాబాద్ ఎంపిక కావడం రాష్ట్ర పురోగతి, ప్రగతి పట్ల తెరస ప్రభుత్వం చూపిన శ్రద్ధ, కృషి ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని అగ్రభాగంలో నిలబెట్టిన తన పాలనా దక్షతకు ఈ అవార్డులే నిదర్శనమని చెబుతున్న కేసీఆర్.. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. కేవలం జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా తెలంగాణ ఘనతను చాటాలని నిర్ణయించారు.
ఇందు కోసం భారీ ఎత్తున ప్రకటనలు విడుదల చేయాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యద్బుతంగా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రచారం చేయడం ద్వారా తన ప్రభుత్వ పని తీరును విశ్వవ్యాప్తం చేసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత హస్తినకు పరిమితం చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు జాతీయ పార్టీపై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-kavitha-side-tracked-in-telangana-politics-39-145703.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.