అంధకారం అలుముకుంటున్న భారత్

Publish Date:Apr 23, 2022

Advertisement

దేశవ్యాప్తంగా సుమారు డజను రాష్ట్రాల్లో చీకట్లు కమ్ముకొంటున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ తో పాటు పంజాబ్, ఏపీలో ఇప్పటికే రోజూ 8 గంటల పైగా విద్యుత్తు కోతలు అమలవుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్తాన్ లకు పట్టిన దుస్థితే భారతదేశంలోనూ తలెత్తవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో 70 శాతం విద్యుత్తు బొగ్గు ఆధారంగానే ఉత్పత్తి అవుతుంది. అయితే.. థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. దీంతో దేశంలో విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో విద్యుత్తు సరఫరా తగ్గిపోయినట్టు అఖిల భారత విద్యుత్తు ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. 150 థర్మల్ ప్లాంట్లలో 81 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి దారుణంగా తగ్గిపోయింది. 54 ప్రైవేటు ప్లాంట్లలో 28 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తంగా మరో తొమ్మిది రోజులకు మాత్రమే సరిపడా బొగ్గు నిల్వలు ప్లాంట్లలో ఉన్నట్టు ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే తెలిపారు. విద్యుదుత్పత్తి కోసం థర్మల్ ప్లాంట్లు 26 రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకుంటాయి. ఈ స్థాయి నిల్వను కనిష్టంగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం యూపీలోని థర్మల్ ప్లాంట్లలో 7 రోజులు, హర్యానాలో 8 రోజులు, రాజస్థాన్ లోని థర్మల్ ప్లాంట్లలో 17 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని  దూబేపేర్కొన్నారు.

వర్షాల కారణంగా గత అక్టోబర్ లో దేశంలోని ప్రధాన బొగ్గు క్షేత్రాల్లోకి వరదనీరు వచ్చిచేరింది. దాంతో బొగ్గును వెలికి తీసే ప్రక్రియకు అంతరాయం కలిగింది. అప్పుడే దేశంలోని ప్రధాన థర్మల్ ప్లాంట్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, విమర్శలను తిప్పికొట్టడంపైనే దృష్టి సారించిన కేంద్రం.. పరిష్కార మార్గాల గురించి ఆలోచించలేదు. పైగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను కూడా తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 2.5 కోట్ల టన్నుల బొగ్గు మాత్రమే దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 50 శాతమే. కాగా, ఈ ఏడాది మార్చి నుంచే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోడు కావడంతో వివిధ రాష్ట్రాల్లో విద్యుత్తు వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ కు సరపడినంత విద్యుత్తు సరఫరా ఉండడం లేదు. బొగ్గు నిల్వలు అడుగంటడంతో కొన్ని ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్తు కోతలు పీక్ కు చేరాయి.

బొగ్గు సంక్షోభానికి వ్యాగన్ల కొరత కూడా ఓ కారణమని ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే పేర్కొన్నారు. ప్లాంట్లకు బొగ్గును రవాణా చేయడానికి 453 రైల్వే రేక్స్ అవసరమని, అయితే కొన్ని రోజుల వరకూ 379 రేక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య 412కు చేరినప్పటికీ, అవి ఎంత మాత్రం సరిపోవన్నారు.

దేశంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తనున్నదని పది పన్నెండు రోజులుగా నిపుణులు, నివేదికలు హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోని కేంద్రం.. ఆ తర్వాత తీరిగ్గా కొద్ది రోజుల క్రితమే ఓ భేటీ నిర్వహించింది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్తు మంత్రి ఆర్కేసింగ్, బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ పాల్గొన్నారు. గంట పాటు ఈ భేటీ జరిగినా.. విద్యుత్తు సంక్షోభ నివారణకు చేపట్టే చర్యలపై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం.

By
en-us Political News

  
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రధానంగా పేదలు, మహిళలు, రైతులు, యువతలకు ప్రయోజనం చూకూర్చే అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఎస్ నెక్ట్స్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న  ఎసిబి కార్యాలయంలో జరుగనున్నవిచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. 
 మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిపై టిడిపి శ్రేణులు ఫైర్ అయ్యాయి.
గత ఏప్రిల్ నెలలో మహరాష్ట్ర నుంచి తెలంగాణలో ఎంటరై అయి ఇద్దరిని చంపేసిన గజరాజు ఉదంతం తెలిసిందే. తాజాగా  ప్రస్తుతం మరో  ఏనుగుల గుంపు తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని ఆటవిశాఖ అధికారులు చాటింపు వేశారు.
Publish Date:May 23, 2023
If AL Basham were alive today, he would have written a book with this title. In these turbulent times, when the very existence of democracy, secularism...
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ఎలాంటి వివాదం లేదు. అదొక వివాదమే కాదు. చట్ట పరంగా చూసినా, మరోల చూసినా, అమరావతి ఆంధ్ర ప్రదేశ్ ఏకైక రాజధాని.అందులో మరోమాటకు అవకాశమే లేదు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్’లో ప్రకటించింది. న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. ఎనిమిదేల్లాకు పైగా, అకడి నుంచే పరిపాలన సాగుతోంది., ఏపీ ఏకైక రాజధాని అని చెప్పేందుకు ఇంకేమి కావాలి, అంటే, సమాధానం ఉండదు. ఒక విధంగా బీజేపీ వారి భాషలో చెప్పాలంటే, ప్రత్యేక హోదా వివాదం లానే, రాజధాని విషయం కూడా ముగిసిన అధ్యాయం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైకి ఏ కారణం చెప్పినా ఆయన బీహార్ పర్యటన మాత్రం కచ్చితంగా తన జాతీయ రాజకీయ ఆకాంక్ష నెరవేర్చుకునే దిశగా మరో అడుగేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన వేసిన అడుగులకు ఎటువంటి సత్ఫలితాలూ రాలేదు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బులంద్‌షెహ‌ర్ లో దేవేంద్రి అనే మ‌హిళకి పాము క‌రిస్తే ఆమె భ‌ర్త ఏకంగా పేడ‌గుట్ట కింద ప‌డుకోబెట్టాడు. ఆమె పాము కాటు విషం నుంచి బ‌య‌ట‌ప‌డి బ‌తుకుతుంద‌ని!
మాథ్యూప‌ద‌కండో ఏట జ‌బ్బు చేసి చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లి కోరీ మాత్రం ఆకాశం వేపు చూసిన‌పుడ‌ల్లా పోనీ అక్క‌డ‌కి వెళ్లాల‌నే వెళ్లాడ‌నే అనుకుంటోంది. దుఖాన్ని మింగుతూ. పిల్లాడి చితాభ‌స్మాన్ని చంద్రుడి మీద‌కి పంప‌డానికి సిద్ధ‌ప‌డింది కోరి. వ‌చ్చే ఏడాది ఆమె కోరిక ఫ‌లించ‌వ‌చ్చు
పాల‌న ఎప్పుడూ జ‌న‌రంజ‌కంగా వుండాలి. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ల‌క్ష్యాలూ ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించాలి గాని ప్ర‌జ‌ల నుంచే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌పుడు మంచి పాల‌న‌ను అందిస్తున్నామ‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌చారం చేయించుకోవ‌డం న‌వ్వుల‌పాలే అవుతుంది. కేంద్రంలో బిజెపి ప్ర‌భుత్వ గ్రాఫ్‌ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల దృష్టిలో ప‌డిపోతోంది. అయినా అగ్నిప‌థ్ వంటి దుర్మార్గ‌పు ఆలోచ‌న‌ల‌తో యువ త‌ను దెబ్బ‌తీయ‌డం కేవ‌లం మూర్ఖ‌పు పాల‌నే అవుతుంది. అస‌లు బిజెపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ప్ర‌జావ్య‌తిరేక‌త వెల్లువెత్తే ప‌రిస్థి తులే వున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కొత్త పార్టీ వెనుక కూడా ఎన్నికల వ్యూహమే ఉందా? ఆ వ్యూహం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుదా? అన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఉరుము లేని పిడుగులా ప్రశాంత్ కిశోర్ తాను కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే వీటిని కేవలం ఊహాగాన సభలుగా కొట్టి పారేయడానికి వీల్లేదని పరిశీలకులు అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ పార్టీ ప్రకటనకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరపడం ఇందు కోసం ఆయన ప్రగతి భవన్ లో రెండు రోజుల బస చేయడాన్ని తార్కానంగా చూపిస్తున్నారు.
ఓ యువకుడి ఆత్మహత్యకు కారకురాలైందని ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఓ యువతిపై అత్యంత క్రూరంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఆమెను కిడ్నాప్‌ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై జుట్టు కత్తిరించి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించారు. ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జీషీటును మంగళవారం కోర్టుకు సమర్పించారు. 21 మందిపై దాఖలైన చార్జిషీట్లో 12 మంది మహిళలు, నలుగురు పురుషులు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.