Publish Date:Jan 16, 2022
ఒమిక్రాన్ ఎరియంట్’గా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపద్యంలో రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా అధికార వర్గాల సమాచారం. ఓ వంక కేంద్ర ప్రభుత్వం, స్థానిక పరిస్థితుల అదారంగా అవసరమైన మేరకు ఆంక్షలు విధించాలని, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.అదే సమయంలో ఆర్థిక, ఉపాథి కార్యక్రమాలు దెబ్బ తినకుండా, సామాన్యుల జీవనోపాధికి సమస్యలు లేకుండా చర్యలు ఉండాలని సూచించింది. ఈ నేపధ్యంలో, కరోనా కట్టడిలో తొలి చర్యగా తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ సలహా మేరకు అన్ని విద్యాలయాలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ విద్యా సంస్థల సెలవులను పొడిగిస్తూ కీలక ప్రకటన చేశారు.
అలాగే, పండగ అనంతర పరిస్థితిని కూలంకషంగా చర్చించి, తదుపరి చర్యలు తీసుకునేందుకు
ముఖ్యమంత్రి సోమవారం మంత్రి వర్గ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవంక పండగ సందర్భంగా రాజదాని హైదరాబాద్ నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్లారు. రేపటి నుంచి తెరిగి రావడం మొదలవుతుంది. కరోనా పై ఈ రాకపోకల ప్రభావం ఉంటుందని, దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ గడచిన మూడు నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే, ఇరుగు పొరుగు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. పొరుగు రాష్ట్రం ఏపీలో ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తారా? లేక కర్ణాటక తరహాలో వీకెండ్ లాక్డైన్ అము చేస్తారా? అదీ కాక, కఠిన ఆంక్షలతో సరిపెడతారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసలు ఉంటాయా? లేదా? అన్నదానిపై రేపటి కేబినెట్ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే,తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో కొత్త కేసులు పెరుగతున్న దృష్ట్యా .. మరో పక్షం రోజుల పాటు ... ఆంక్షలు విధిస్తారని అటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-another-lockdown-in-telangana-39-130247.html
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.