దిగ్గజ ఐటీ కంపెనీలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది. అయితే ఈ దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ యూఏఈ ఓ ప్రకటనలో పేర్కొంది.
దుబాయ్ ఇంటర్నెట్ సిటీలో ఉన్న ఒరాకిల్ భవనం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిందన్న వార్తలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఒరాకిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే యూఏఈ ప్రభుత్వ మీడియా కార్యాలయం ' ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఒరాకిల్ పై దాడి జ వార్తలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని స్పష్టం చేసింది.
ప్రాంతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి వదంతులు వ్యాపించాయనీ, వాటిని విశ్వసించవద్దనీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇరాన్కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల్లోని వాణిజ్య, సాంకేతిక కేంద్రాలపై దాడులకు పాల్పడతామనీ, మరీ ముఖ్యంగా దిగ్గజ ఐటీ సంస్థలను లక్ష్యం చేసుకుంటామనీ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఒరాకిల్ పై దాడి వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఒరాకిల్ పై ఇరాన్ దాడి అవాస్తవమని యూఏఈ క్లారిటీ ఇవ్వడమే కాకుండా, ఒరాకిల్ లో కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. అనధికారిక వార్తలను విశ్వసించవద్దని ప్రజలను కోరింది. దేశంలోని పౌరులు, విదేశీయులు, వాణిజ్య సంస్థల భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నామని యూఏఈ పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-attack-on-orakik-in-dubai-36-216598.html
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.