ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ. అదీ ఐపీఎల్కున్న క్రేజ్, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది ఐపీఎల్. అందుకే దాని వాల్యూ కూడా అలా అలా పెరిగిపోతూ వస్తోంది. ఏడాది కూడా ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఏకంగా 12.9 శాతం పెరిగింది. అంటే 18.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది కంటే ఇది 3.9 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే.. ఇప్పుడు ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అటూ ఇటూగా 1.56 లక్షల కోట్లు.
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హౌలిహాన్ రిలీజ్ చేసిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. ఐపీఎల్ కోసం బీసీసీఐ మొత్తం నలుగురు స్పాన్సర్లకు అవకాశం ఇచ్చింది. మైఎలెవన్ సర్కిల్, ఏంజెల్ వన్, రూపే, సియట్.. ఈ నాలుగు స్పాన్సర్లు 14 వందల 85 కోట్ల మనీని జనరెట్ చేశాయి. ఇది లాస్ట్ ఇయర్ కంటే పాతిక శాతం ఎక్కువ. అదే సమయంలో ఈ టోర్నమెంట్ స్పాన్సర్షిప్గా ఉన్న టాటా గ్రూప్.. 2028 వరకు డీల్ను పొడిగించింది. ఈ డిల్ విలువ 2 వేల 500 కోట్లు. ఈ కారణాలు ఐపీఎల్ బ్రాండ్ను మరింత పెంచాయి. ఐపీఎల్ ఓకే.. ఇక ఫ్రాంచైజీల విషయానికి వస్తే.. ఈ సారి టైటిల్ విన్నర్గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాప్ ప్లేస్లో నిలిచింది.
17 ఏళ్లపాటు కప్పు గెలవకపోతేనే ఈ టీమ్ ఫ్యాన్ బేస్, బ్రాండ్ వాల్యూ చెక్కు చెదరలేదు. ఈసారి కప్పు గెలవడంతో ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. గత ఏడాది 227 మిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ.. ఈ సారి ఏకంగా 269 మిలియన్ డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే 2 వేల 300 కోట్ల వరకు ఉంటుంది. నిజానికి ఎప్పటి నుంచో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ టాప్ ప్లేస్లో ఉంటున్నాయి. కానీ ఈ ఏడాది ఆర్సీబీ వీటిని బీట్ చేసేసింది.
ఇక 2 వేల 21 కోట్లతో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, 1963 కోట్లతో మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. ఈ ఏడాది బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచుకున్న ఏకైక టీమ్ పంజాబ్ కింగ్స్. ఈ ఏడాది తమ ఆటతో అందరి మనసులు దోచుకున్న ఈ టీమ్ ఏకంగా తమ బ్రాండ్ వాల్యూని 39.6 శాతం పెంచుకుంది. ప్రస్తుతం ఈ టీమ్ 12 వందల 9 కోట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నా.. ఎదుగుదల విషయంలో మాత్రం టాప్ ప్లేస్లో ఉందని చెప్పాలి. 1946 కోట్లతో కోల్కతా నాలుగో స్థానంలో.. 1320 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదోస్థానంలో.. 1303 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో, 1252 కోట్లతో రాజస్థాన్ ఏడో స్థానంలో.. 1217 కోట్లతో గుజరాత్ టైటాన్స్ 8వస్థానంలో నిలిచాయి. ఇక 1046 కోట్లతో లక్నో చివరి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఐపీఎల్ బ్రాండ్ పెరుగుతూ వస్తుంటే.. టీమ్ వాల్యూస్ మాత్రం ఆయా జట్ల పర్ఫామెన్స్, ఫ్యాన్ బేస్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉంటున్నాయి. మరి నెక్ట్స్ సీజన్లో ఏ టీమ్ వాల్యూ ఎలా మారుతుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ipl-brand-value-increased-25-201584.html
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.