పాయె.. అయిపాయె.. ఐప్యాక్ కూడా జగన్ కు జెల్ల కొట్టేసింది!

Publish Date:May 14, 2024

Advertisement

జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండటంతో జగన్ పార్టీ మూటాముల్లె సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్తా జూన్ 4న పూర్తైపోతుంది అన్నది ఇప్పటి వరకూ పరిశీలకులు, విపక్ష కూటమి నేతలూ చెబుతున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడటానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్నా.. జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐప్యాక్ నిలిచింది.

ఇన్నేళ్లుగా జగన్ వ్యూహాలు, ఎత్తుగడలన్నిటి వెనుకా నిలిచిన ఐ ప్యాక్ పోలింగ్ పూర్తి కాగానే జగన్ కు జెల్ల కొట్టేసిందని అర్ధమౌతోంది. పోలింగ్ సోమవారం (మే13) పూర్తయ్యింది. మే 15( బుధవారం ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ ఆయన టీమ్ జగన్ తో కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు ఎప్పుడో నిర్ణయించేసుకున్నాయి. ఆ సందర్భంగా ఐ ప్యాక్ జగన్ ను సన్మానించాలని కూడా భావించింది. అయితే ఇప్పుడు ఆ విజయోత్సవ సంబరం, జగన్ సన్మాన కార్యక్రమం రెండింటినీ కూడా ఐప్యాక్ రద్దు చేసుకుంది.  

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే బుధవారం ఐప్యాక్ బృందంతో కలిసి జగన్ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలేవారు. కానీ పోలింగ్ రోజు ఉదయం నుంచే ప్రజలలో కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత పోలింగ్ సరళితో ప్రస్ఫుటంగా కనిపించడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి ప్రజా వ్యతిరేకత సునామీలా ఈవీఎమ్ లలో నిక్షిప్తమైపోయిందని స్పష్టమైపోవడంతో  వైపీపీ బెంబేలెత్తిపోయింది. అలాగే ఐప్యాక్ కూడా మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అయిపోయింది. దీంతో బుధవారం ( మే 15) విజయవాడ బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయంలో జరగాల్సిన వేడుకలకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ ను ఐ ప్యాక్ ఆఫీసుకు ఆహ్వానించి సన్మానించాలన్న రుషిరాజ్ సింగ్ ప్రణాళికకు గండిపడింది. జగన్ ఐప్యాక్ కార్యాలయానికి రావడం లేదనీ, ఆయన సన్మాన కార్యక్రమం రద్దైందనీ ఐప్యాక్ వర్గాల ద్వారానే విశ్వసనీయంగా తెలిసింది. 

ఈ మేరకు వైసీపీ నుంచి ఐప్యాక్ కు స్పష్టమైన సమాచారం అందింది.  దీంతో భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవాలన్న ఐప్యాక్, వైసీపీల ప్రణాళిక కార్యరూపం దాల్చకుండానే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇది ఎన్నికలలో జగన్ కు విజయావకాశాలు ఇసుమంతైనా లేవన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటుతోందని పరిశీలకులు చెబుతున్నారు.  అంతే కాదు ఐప్యాక్ సభ్యులకు కంపెనీ ఇచ్చిన  మెబైల్ ఫెన్ లు, ల్యాప్ టాప్ ల  బుధవారం (మే 15) ఉదయానికల్లా తిరిగి ఇచ్చేయాలని విస్పష్ట ఆదేశాలు అందాయి. అంతే కాదు వారికి ఇవ్వవలసిన ఈ నెల వేతనాలు, ఇతర అలవెన్సులు అందజేస్తామని తెలిపింది. అంతే కాకుండా ఎవరైన లాప్ టాప్, మెబైల్స్ రిటర్న్ చేయకుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరిక కూడా జారీ అయ్యింది.

ఇంత అర్జంట్ గా ఐ ప్యాక్ సభ్యుల నుంచి పోన్లు, ల్యాప్ టాప్ లను వెనక్కు తీసుకోవడానికి కారణం ప్రభుత్వం మారితే తమ ఫేక్ ప్రోపగాండా బయటకు పొక్కి చిక్కుల్లో పడతామన్న భయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు జగన్ ఐప్యాక్  రిషిరాజ్ సింగ్ ఆయన టీమ్ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారనీ, అంతే కాకుండా వారికి ఇస్తామన్న 50 కోట్ల రూపాయల ప్యాకెజీని హోల్డ్ లో పెట్టారనీ తెలుస్తోంది.   ఆ కారణంగానే ఐ ప్యాక్ జగన్ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకుందని అంటున్నారు. 

By
en-us Political News

  
కేంద్రమంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  మాజీ ప్రధాని నెహ్రూ వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన సంగతి తెలిసిందే.
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదేళ్ళపాటు జగన్‌తో అంటకాగి ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన పాపం తన పీకకు భారీ స్థాయిలో చుట్టుకుంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మళయాళ నటుడు సురేష్ గోపి అరుదైన రికార్డు దక్కించుకున్నారు.  కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించిన ప్రముఖ నటుడు సురేశ్ గోపి... మోదీ కేబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా మరో మైలురాయిని అందుకుంటున్నారు.
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఉలవచారు బిర్యానీ చిత్రంలో ఈ సాంగ్ గుర్తొచ్చే విధంగా ఉంది మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో నడ్డా విందు.  ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది. 
తాజాగా రాష్ట్రం నుంచి మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్‌లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి నరసాపురం బీజేపీ ఎంపీ  భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కిందని సమాచారం.
వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. వారిలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. 
జడ్చర్ల పంచాయతీ కార్యాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీ. శ. 12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా .ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం వున్న మద్యం పాలసీని రద్దు చేపి కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది.
భారతీయ చట్టాలు ప్రధానంగా ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని రూపుదిద్దారు. బ్రిటీషు కాలం నుంచి ఇదే విధానం కొనసాగుతుంది. ఒకటి ఇండియన్ పినల్ కోడ్ రెండు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ , మూడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే భారతీయ సాక్ష్యాధార చట్టం. సాక్ష్యం బట్టి నేరం రుజువు అవుతుంది. దేన్ని సాక్ష్యం తీసుకోవాలి అనే విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 
లోకసభ ఎన్నికల్లో కూటమి దూసుకు పోయింది. తెలంగాణలో ఏ పార్టీతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల పొత్తు లేకుండానే ఒంటరిగా పోటీ చేసిన బిజెపికి ఎనిమిది సీట్లు దక్కాయి.  ఈ నెల 9 సాయంత్రం (ఆదివారం)ప్రదానిగా  మోదీ  ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా  ఇద్దరు ఎంపీలకు కేబినెట్ బెర్తులు దక్కే అవకాశం ఉంది. 
నరేంద్ర మోడీ 3.0 గవర్నమెంట్‌లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే వారి లిస్టు ఇలా వుంటుందని తెలుస్తోంది. మొత్తం 43 మంది మంత్రులు వుండబోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.