మద్యం కుంభకోణం దర్యాప్తు వేగాన్ని అడ్డుకుంటున్నది అదృశ్య శక్తులా; చీకటి ఒప్పందాలా?

Publish Date:Jan 30, 2026

Advertisement

తెలుగువన్ వాస్తవ వేదిక పదో సంచికలో తెలుగువన్ ఎండి కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్  ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో నిందితుల నిగ్గు తేల్చడంలో జరుగుతున్న జాప్యంపై చర్చించారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నదని నిలదీశారు. దేశంలోనే అతి పెద్ద అవినీతి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డోలేంద్ర ప్రసాద్ అభివర్ణించగా, ప్రజల ధనం, ఆరోగ్యంతో ఆటలాడిన ఈ కుంభకోణంలో నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో విఫలమవ్వడం కంటే దారుణం మరొకటి ఉండదని, అధిక ధరలకు చౌకబారు మద్యం అమ్మారనీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.   దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల నగదు లావాదేవీలతో కూడిన భారీ స్కామ్ దర్యాప్తు జగన్ తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం వద్దకు వెళ్లకుండా ఎందుకు ఆగిపోయిందని, ఎవరు ఆపుతున్నారనీ డోలేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్ ను ప్రాథాన్యత ఇస్తుంటే, జగన్ హయాంలో ప్రభుత్వం మద్యం విక్రయాలను నగదు ద్వారా మాత్రమే జరపడం ద్వారా పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేత కూడా జరిగిందని ఆరోపించారు.

ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం కేసును  సిట్ కేవలం మూడు వేల కోట్ల రూపాయల ముడుపులపై మాత్రమే దర్యాప్తు చేస్తున్నదన్న డోలేంద్ర ప్రసాద్ ఆ ముడుపుల సొమ్మును న్నికల ఖర్చులు, ఇతర అవసరాలకు తరలించారన్నారు. అన్నిటికీ మించి చౌకబారు మద్యాన్ని (ఛీప్ లిక్కర్) అధిక ధరలకు విక్రయించి ప్రజారోగ్యంపై విషం చిమ్మారనీ.. దీని వల్ల ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారనీ, మరెంతో మంది అనారోగ్యం పాలయ్యారనీ పేర్కొన్నారు. జగన్ హయాంలో నాణ్యత లేని మద్యాన్ని విక్రయించారన్న విషయాన్ని రఘురామకృష్ణం రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు అంతర్జాతీయ ల్యాబ్‌ టెస్ట్ ల ద్వారా ఆధారాలతో రుజువు చేశారని వివరించారు.  

మద్యం స్కామ్ గత ఎన్నికల్లో కూటమి విజయంలో  కీలక పాత్ర పోషించిందన్నారు. మద్యం కుంభకోణం కారణంగానే  జగన్ మోహన్ రెడ్డి  ఓట్ బ్యాంక్ అయిన పేద వర్గాల ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా కసితో ఓటేశారన్నారు. అటువంటిది ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం కేసులో సూత్రధారులను పట్టుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నదని నిలదీశారు.   ఇందుకు కారణం అదృశ్య శక్తులా,  రహస్య ఒప్పందాలా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.  

ఈ సంచిక వాస్తవ వేదిక పూర్తి పాఠాన్ని తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో ఈ లింక్ లో వీక్షించండి

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.