Publish Date:Jan 17, 2025
తన విధులకు ఆటంకం కలిగించినట్టు గత నెలలో బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.
తన ఫోన్ ట్యాప్ అవుతుందని గత నెల నాలుగో తేదీన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి వచ్చారు. ఇదే సమయంలో బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్
రాఘవేందర్ స్టేషన్ నుంచి బయటకు వెళుతున్నారు. తాను వస్తున్న విషయాన్ని ముందే ఇన్స్ పెక్టర్ రాఘవేందర్ పసిగట్టి స్టేషన్ నుంచి వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి వాదన. తన వాహనాన్ని అడ్డుకున్నట్లు రాఘవేందర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉంది. విచారణ కోసం కౌశిక్ రెడ్డి విచారణాధికారిగా ఉన్న మాసాబ్ ట్యాంక్ ఇన్స్ పెక్టర్ ఎదుట హాజరయ్యారు. విచారణాధికారి ప్రశ్నలకు కౌశిక్ రెడ్డి సమాధానాలిచ్చి ఇంటికి వెళ్లిపోయారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి నిన్ననే మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు హాజరుకావాల్సి ఉంది. ఒక కేసు విషయంలో కరీంనగర్ కోర్టుకు హాజరు కావల్సి ఉన్నందున శుక్రవారం హాజరౌతానని కౌశిక్ రెడ్డి పోలీసులకు ముందుగానే తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడు బంజారాహిల్స్ ఇన్స్ పెక్టర్ కావడంతో విచారణాధికారిగా మాసాబ్ ట్యాంక్ ఇన్స్ పెక్టర్ పరశురాంను నియమించారు. పరశురాం ఇచ్చే నివేదికను బట్టి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/investigation-of-mla-kaushik-reddy-in-masab-tank-ps-39-191419.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.