హస్తం పార్టీలో అంతర్యుద్ధం.. వ్యక్తిగత రాగ ద్వేషాలపై రగులు తున్న నేతలు

Publish Date:May 31, 2025

Advertisement

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ రెబెల్ స్టార్, కల్వకుట్ల కవిత  చేసిన సంచలన వ్యాఖ్య ఇది.  ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటన్నారో  కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ఆమె ఈ వ్యాఖ్య చేశారో లేక దేశం మొత్తంలో హస్తం పార్టీ మునిగి పోతున్నదనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో ఏమో కానీ..   పార్టీ పరిస్థితి దేశం అంతటా ఒకేలా ఉందన్న చర్చ కాంగ్రెస్  వర్గాల్లోనే   జరుగుతోంది. 

ముఖ్యంగా..  పాకిస్థాన్ మన దేశం పై దశాబ్దాలుగా సాగిస్తున్న ఉగ్రవాద దుశ్చర్యలను శాశ్వతంగా తుదముట్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం,  సైన్యం వ్యూహాత్మకంగా సాగిస్తున్న బహుముఖ యుద్ధం విషయంలో..  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ ప్రతిష్టను దిగజాజరుస్తున్నాయని సీనియర్ నాయకులు అంటున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కొందరు ముఖ్య నాయకులు చేస్తున్న పాక్ అనుకూల వ్యాఖ్యలు  పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇదే ధోరణి కొనసాగితే..  రాజకీయంగానూ పార్టీ భారీ మూల్యం చెల్లిచుకోవలసి  వస్తుందని  పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాదు..  దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో..  దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి  వ్యక్తిగత రాగ ద్వేషాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, అందుకు పార్టీ మాత్రమే కాదు.. దేశం కూడా  మూల్యం చెల్లించవలసి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.   

దేశంలో పాక్ వ్యతిరేక  సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో.. రాహుల్ గాంధీ వ్యక్తిగత రాగద్వేషాలకు అనుగుణంగా ప్రదాని మోదీ, భారత సైన్యాన్ని, చివరకు సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులను అనుమానించడం, అవమానించడం పార్టీకీ,  దేశానికీ మంచింది కాదని సీనియర్ నాయకులు అంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే  కొదరు కీలక నేతలు  ప్రధాని మోదీకీ, దేశానికీ మధ్య ఉన్న విభజన రేఖను చెరిపేసి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అనుకూల వైఖరి అవలంబిస్తోందనే తప్పుడు సంకేతలు పంపుతోందని  సీనియర్ నేతలు  అభిప్రాయ పడుతున్నారు.

ముఖ్యంగా.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రపంచ దేశాల్లో సాగిస్తున్న ఎంపీల దౌత్య యాత్రలో భాగంగా..    కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్  సహా.. పార్టీలకు అతీతంగా ఎంపిక చేసిన ఎంపీల ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో, రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు  పాకిస్థాన్ ప్రధాని సహా ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన భారత సైన్యం, భారత ఆయుధ సంపద, మన యుద్ద విమానాల సామర్ధ్యాన్ని ప్రశ్నించడం పార్టీ ప్రతిష్టను పలచన చేస్తోందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.  స్వయంగా పాకిస్థాన్ ప్రధాని తమ సైన్యం కళ్ళు తెరిచే ముందే భారత  వైమానిక దళం  తమ దేశంలోని 11  వైమానిక స్థావరాలను ద్వంస  చేసిందని బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి  ఆయన అనుచరులు  ఇంకా.. పాకిస్థాన్ కూల్చిన యుద్ధవిమానాల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేయడం  దేశ  ప్రజల మనో ధైర్యాన్ని దేబ్బతీసే చర్యగా పేర్కొంటున్నారు. 

మరో వంక  మన ఎంపీల బృందానికి సారధ్యం వహిస్తున్న శశిథరూర్ పార్టీ  లక్ష్మణరేఖ  దాటారని  కోటరి నేతలు ఆయనపై విరుచుకుపడడం పార్టీ ఇమేజ్ ని తీసిందనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఒక్క రాహుల్ గాంధీ ముచ్చట తీర్చేందుకు, దేశం తరపున దౌత్యపర్యటనలో ఉన్న పార్టీ ఎంపీ, శశిథరూర్’ను టార్గెట్ చేస్తూ కొందరు నాయకులు  చేస్తున్న విమర్శలు పార్టీ ప్రతిష్టనే కాదు, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని సీనియర్ నేతలు విచారం వ్యక్తపరుస్తున్నారు.  

ఈ నేపధ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ మరో  బాంబు పేల్చారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతించారు. నిజానికి కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దుని వ్యతిరేకించడమే కాదు..  కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దానిని పునరుద్దరిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పడు.. ఖుర్షీద్  ఆర్టికల్ రద్దుకు  ఆ రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఆ క్రమంలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 65శాతం మేర పోలింగ్ నమోదయిందని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని వివరించారు. ఇండినేషియా పర్యటనలో భాగంగా అక్కడి మేథావులు, విద్యా సంస్థల ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా సీనియర్ నాయకులు ఒకరొకరుగా రాహుల్ బృందం భాషలో లక్ష్మణ రేఖను దాటుతున్నారు. అందుకే కావచ్చును కవిత, కాంగ్రెస్ మునుగుతున్న నావ అన్నారు.నిజమే కావచ్చును.

By
en-us Political News

  
ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
Publish Date:Jul 3, 2025
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.