హస్తం పార్టీలో అంతర్యుద్ధం.. వ్యక్తిగత రాగ ద్వేషాలపై రగులు తున్న నేతలు

Publish Date:May 31, 2025

Advertisement

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. బీఆర్ఎస్ రెబెల్ స్టార్, కల్వకుట్ల కవిత  చేసిన సంచలన వ్యాఖ్య ఇది.  ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాటన్నారో  కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ఆమె ఈ వ్యాఖ్య చేశారో లేక దేశం మొత్తంలో హస్తం పార్టీ మునిగి పోతున్నదనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్య చేశారో ఏమో కానీ..   పార్టీ పరిస్థితి దేశం అంతటా ఒకేలా ఉందన్న చర్చ కాంగ్రెస్  వర్గాల్లోనే   జరుగుతోంది. 

ముఖ్యంగా..  పాకిస్థాన్ మన దేశం పై దశాబ్దాలుగా సాగిస్తున్న ఉగ్రవాద దుశ్చర్యలను శాశ్వతంగా తుదముట్టించేందుకు, ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం,  సైన్యం వ్యూహాత్మకంగా సాగిస్తున్న బహుముఖ యుద్ధం విషయంలో..  కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ ప్రతిష్టను దిగజాజరుస్తున్నాయని సీనియర్ నాయకులు అంటున్నారు. అంతే కాదు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కొందరు ముఖ్య నాయకులు చేస్తున్న పాక్ అనుకూల వ్యాఖ్యలు  పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఇదే ధోరణి కొనసాగితే..  రాజకీయంగానూ పార్టీ భారీ మూల్యం చెల్లిచుకోవలసి  వస్తుందని  పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాదు..  దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో..  దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి  వ్యక్తిగత రాగ ద్వేషాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, అందుకు పార్టీ మాత్రమే కాదు.. దేశం కూడా  మూల్యం చెల్లించవలసి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.   

దేశంలో పాక్ వ్యతిరేక  సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో.. రాహుల్ గాంధీ వ్యక్తిగత రాగద్వేషాలకు అనుగుణంగా ప్రదాని మోదీ, భారత సైన్యాన్ని, చివరకు సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులను అనుమానించడం, అవమానించడం పార్టీకీ,  దేశానికీ మంచింది కాదని సీనియర్ నాయకులు అంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే  కొదరు కీలక నేతలు  ప్రధాని మోదీకీ, దేశానికీ మధ్య ఉన్న విభజన రేఖను చెరిపేసి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అనుకూల వైఖరి అవలంబిస్తోందనే తప్పుడు సంకేతలు పంపుతోందని  సీనియర్ నేతలు  అభిప్రాయ పడుతున్నారు.

ముఖ్యంగా.. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రపంచ దేశాల్లో సాగిస్తున్న ఎంపీల దౌత్య యాత్రలో భాగంగా..    కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్  సహా.. పార్టీలకు అతీతంగా ఎంపిక చేసిన ఎంపీల ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న సమయంలో, రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు  పాకిస్థాన్ ప్రధాని సహా ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన భారత సైన్యం, భారత ఆయుధ సంపద, మన యుద్ద విమానాల సామర్ధ్యాన్ని ప్రశ్నించడం పార్టీ ప్రతిష్టను పలచన చేస్తోందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.  స్వయంగా పాకిస్థాన్ ప్రధాని తమ సైన్యం కళ్ళు తెరిచే ముందే భారత  వైమానిక దళం  తమ దేశంలోని 11  వైమానిక స్థావరాలను ద్వంస  చేసిందని బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి  ఆయన అనుచరులు  ఇంకా.. పాకిస్థాన్ కూల్చిన యుద్ధవిమానాల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేయడం  దేశ  ప్రజల మనో ధైర్యాన్ని దేబ్బతీసే చర్యగా పేర్కొంటున్నారు. 

మరో వంక  మన ఎంపీల బృందానికి సారధ్యం వహిస్తున్న శశిథరూర్ పార్టీ  లక్ష్మణరేఖ  దాటారని  కోటరి నేతలు ఆయనపై విరుచుకుపడడం పార్టీ ఇమేజ్ ని తీసిందనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఒక్క రాహుల్ గాంధీ ముచ్చట తీర్చేందుకు, దేశం తరపున దౌత్యపర్యటనలో ఉన్న పార్టీ ఎంపీ, శశిథరూర్’ను టార్గెట్ చేస్తూ కొందరు నాయకులు  చేస్తున్న విమర్శలు పార్టీ ప్రతిష్టనే కాదు, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని సీనియర్ నేతలు విచారం వ్యక్తపరుస్తున్నారు.  

ఈ నేపధ్యంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ మరో  బాంబు పేల్చారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని స్వాగతించారు. నిజానికి కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దుని వ్యతిరేకించడమే కాదు..  కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దానిని పునరుద్దరిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పడు.. ఖుర్షీద్  ఆర్టికల్ రద్దుకు  ఆ రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఆ క్రమంలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 65శాతం మేర పోలింగ్ నమోదయిందని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని వివరించారు. ఇండినేషియా పర్యటనలో భాగంగా అక్కడి మేథావులు, విద్యా సంస్థల ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలా సీనియర్ నాయకులు ఒకరొకరుగా రాహుల్ బృందం భాషలో లక్ష్మణ రేఖను దాటుతున్నారు. అందుకే కావచ్చును కవిత, కాంగ్రెస్ మునుగుతున్న నావ అన్నారు.నిజమే కావచ్చును.

By
en-us Political News

  
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
పటాన్ చెరు లోని పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావితం చూపింది. ప్రమాదం జరిగిన తరువాత ఆ కంపెనీ షేర్లు దారుణంగా పతన‌మ‌య్యాయి. 3 రోజుల్లోనే దాదాపు 24 శాతం షేర్ వాల్యూ ప‌డిపోయింది.
ఎంతైనా ట్రంపు ట్రంపే.. ప్ర‌పంచంలో ఉన్న ఎన్నో వివాదాలను ప‌రిష్కరించారు. ఆయ‌న‌కా క్రెడిట్ ద‌క్కాల్సిందే... ఈ మాట అన్నది ఎలాన్ మ‌స్క్. ఇన్నాళ్లూ ఉప్పూ- నిప్పుగా ఉన్న ఈ ఇద్ద‌రూ ఇపుడు కలిసిపోయారా?
వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా పుణె నుంచి గోవా వెడుతున్న ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.
పరిశ్రమలలో వరుస ప్రమాదాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన అనంతరం మేడ్చల్ లోని ఓ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్‌ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.