బిజేపీలో బహిర్గతమైన ఈటల, బండి వర్గపోరు!

Publish Date:Jul 19, 2025

Advertisement

తెలంగాణ బీజేపీ అంతర్గత కుమ్యులాటలు, గ్రూపు రాజకీయాల విషయంలో కాంగ్రెస్ తో పోటీ పడుతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి నియామకం తరువాత నుంచి తెలంగాణ బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆ పార్టీకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాలూ చూస్తుంటే.. పార్టీ అధిష్ఠానమే రాష్ట్రంలో పార్టీని పతనం దిశగా నడిపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లోనే నడుస్తోంది. 

తాజాగా ఈటల రాజేందర్ ఓపెన్ అప్ అయిపోయారు. సొంత పార్టీ వాళ్లే తనను వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రాజేందర్  అన్న మాటేమిటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటించిన క్షణం నుంచీ బీజేపీలో ఆసంతృప్తి జ్వాల భగ్గుమంది.  ఆ పదవిని ఆశించిన బీజేపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు మీ గుప్పిస్తున్నారు. రాజాసింగ్ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా, ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పైనా ప్రత్యక్ష, పరోక్ష విమర్శలతో విరుచుకుపడుతున్నారు. 

తాజాగా ఈటల రాజేందర్ తన నివాసంలో నిర్వహించిన బీజేపీ హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో పేరు ప్రస్తావించకుండా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో తనను హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఓడించేందుకు సొంత పార్టీ వారే కుట్రలు పన్నారన్నారు. అప్పట్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి అసలు క్యాడరేలేదని గుర్తు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించి హుజూరాబాద్ నుంచి అప్పట్లో తాను ఓడిపోయాననీ, అయితే ప్రజల మనస్సులను గెలుచుకుని మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించాననీ చెప్పుకొచ్చారు.  తాను ఎన్నడూ వ్యక్తులను నమ్ముకుని, వారిపై ఆధారపడలేదనీ, ప్రజలను నమ్ముకునే ప్రజాజీవితంలో సాగుతున్నానని చెప్పుకున్న ఈటల.. వారిని కూడా తనకు దూరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారనీ, ఇక ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.  

త‌న‌పైనా.. త‌న కుటుంబంపైనా సామాజిక మాధ్యమంలో వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తున్నారన్నారు.   తాను ప‌ద‌వుల కోసం  వెంప‌ర్లాడ‌లేనీ, వాటి కోసం పార్టీలు మారలేదనీ చెప్పిన ఈటల గతంలో తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కు తన నిర్ణయాలను నిర్మొహమాటంగా చెప్పానని గుర్తు చేశారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటినీ హై కమాండ్ దృష్టికి తీసుకువెడుతున్నానని ఈటల చెప్పారు. ఈటల ఎక్కడా నేరుగా బండి సంజయ్ పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన విమర్శల దాడి నేరుగా బండిపైనేనని అర్ధమౌతూనే ఉంది. ఎందుకంటే ఇటీవల బండి సంజయ్ కూడా ఈటల టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలలో తనకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓట్లు పడకుండా కుట్ర జరిగిందని రెండు రోజుల కిందట బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీలో వర్గాలు ఉండవనీ, ఉండేది ఒకే వర్గం, అది మోడీ వర్గమని బండి రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఈటల బదులిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తిరుమలలో శ్రీవారి దర్శనం, వసతుల పేరిట ఇంటర్నెట్‌లో నకిలీ వెబ్‌సైట్లు పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
తమిళనాడులోని ఎంఎస్‌యూ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో ఐదు విమానలు అధికారులు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులో ఈడి విచారణ కొనసాగుతున్నది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది.
పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తన అడ్డా అనుకున్న పులివెందులలో వైసీపీ చతికిల పడటం, తన ఖిల్లా అనుకున్న పులివెందుల బీటలు వారడంతో ఆయన ఇక తనకు ఉగాదులు లేవు, ఉషస్సులు లేవన్న నిర్వేదంలో పడిపోయారు  జగన్. 
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీ ఖాన్ నియామకం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్‌లో చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు విద్యుత్ శాఖ అధికారులు జప్తు నోటీసులు జారీ చేశారు.రూ. 31,829 కరెంట్ బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది.
అమరావతి సచివాలయంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఇవాళ తొలిసారిగా నిర్వహించారు.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీ డొల్లతనాన్ని కళ్లకు కట్టింది. ఈ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు రంగంలోకి దిగడంతోనే ఇంత కాలం మా కంచుకోట, అడ్డా.. ఇక్కడ మాకు ఎదురే లేదు అంటూ వైసీపీ పలుకులన్నీ ఉత్త డొల్లేనని అవగతమైపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.