Publish Date:May 31, 2024
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక యాత్ర కోసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం లోకి వెళ్లిపోయారు.
Publish Date:May 31, 2024
బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రాని పక్షంలో మోడీ ప్రధానిగా మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని అనుకోవడం కష్టమే. కాంగ్రెస్ తన చాణక్యం ప్రదర్శించిందంటే, కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావడం అసాధ్యమయ్యే అవకాశం కూడా వుంది.
Publish Date:May 31, 2024
బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి నెలకొని ఉంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఉన్న ఐక్యత పదేళ్ల తరువాత మచ్చుకు కూడా కనిపించడం లేదా? అంటే బీజేపీ వర్గాలే ఔనని అంటున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న కమలం, ఆ విజయం సాధించినా ముచ్చటగా మూడో సారి మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నాయి.
Publish Date:May 31, 2024
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావం సదర్భంగా జూన్ 2న నిర్వహించే అధకారిక కార్యక్రమానికి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వయంగా లేఖ రాసి దానిని ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ కు ఇచ్చి స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను, తన లేఖను ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరారు.
Publish Date:May 31, 2024
ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు
Publish Date:May 31, 2024
న్యాయం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, మన కోసం, తెగించి పోరాడే వాళ్ళ భుజం తట్టి ప్రోత్సాహించడం మన కనీస ధర్మం అని... ఏబీ వెంకటేశ్వరరావుని అభినందించడానికి బంధుమిత్ర సమేతంగా రండి అని ఆహ్వానిస్తున్నారు.
Publish Date:May 31, 2024
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. ఏడువిడతల ఎన్నికల షెడ్యూలులో భాగంగా జూన్ 1వ తేదీన చివరి విడతగా 57లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు రాత్రి ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి.
Publish Date:May 31, 2024
అమరావతికి మంచి రోజులు వస్తున్నాయి. మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్న నమ్మకం పెరుగుతోంది. మే 13న ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సరళి చూసిన తరువాత అందిరిలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Publish Date:May 31, 2024
శుక్రవారం నాడు ఏబీవీ చివరి వర్కింగ్ డే.. రిటైర్మెంట్ డే రోజున ఆయన విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవీ విరమణ చేస్తారు. మొత్తానికి ఇలా జగన్ సర్కార్ ఏవీ వెంకటేశ్వర రావు చివరి వర్కింగ్ డే రోజున పోస్టింగ్ ఇస్తూ తన పైశాచిక ఆనందాన్ని ప్రకటించుకుంది. ప్రింటింగ్ మరియు స్టేషనరీ డిజీ గా ఏబివి కి పోస్టింగ్ ఇచ్చారు.
Publish Date:May 31, 2024
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. కౌంటింగ్ ఏజెంట్ల తో సమావేశం సందర్భంగా ఆయన చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు సజ్జలపై కేసు నమోదు చేశారు.
Publish Date:May 31, 2024
మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఓటమి ఛాయలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు అలర్ట్ అవుతున్నారు. ముందు ముందు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు.
Publish Date:May 30, 2024
ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగేందుకు సమయం ఆసన్నమైంది. ఐదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనకు మే 13న జరిగిన పోలింగ్లో ప్రజలు ఓటు ద్వారా చెక్పెట్టారు. ఆ ఫలితాలు జూన్ 4న వెల్లడి కానున్నాయి.
Publish Date:May 30, 2024
తిరుమలలో రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు.