వినదగునెవ్వరు చెప్పిన...

Publish Date:Feb 28, 2022

Advertisement

"ఒరేయ్ బాబూ… అది కాదురా దారి ఇది. ఇలా వెళ్ళాలి" అంటాడు ఓ పెద్దాయన.

"ఎహె!! నేను నీ మాట ఎందుకు వినాలి పెద్దరికం ఉంటే ఇంతే, ప్రతిదానికి అడ్డుపడతారు" అంటాడు ఓ కుర్రకుంక.

"ఒరేయ్ నానీ నీకు కథ చెబుతానురా…." అంటాడు ఒక ముసలాయన.

"ఉరుకో నాన్నా చదస్తపు కథలతో ఎందుకు పిల్లొళ్లను మూర్ఖులుగా మార్చుతావు అంటాడు కొడుకు.

"అన్నా!! నువ్వు వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు. నేను చెబుతానురా" అంటాడు ఒక పిల్లాడు.

"ఒరేయ్ నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఊరికే నా టైమ్ వేస్ట్ చేయక పోరా ఇక్కణ్ణుంచి" అంటాడు ఆ పెద్దోడు.


ఇలాంటివి ప్రతి మనిషి జీవితంలో, ఆ మనిషి చుట్టూరా చాలా వినబడుతూ, కనబడుతూ ఉంటాయి. ఈకాలం మనుషులు చాలా తక్కువ విస్తృతంలో ఇరుక్కుపోయారు. మనిషి ఎంత ఆలోచిస్తే అంత, ఎంత తెలుసుకుంటే అంత అనే విషయాన్ని మెల్లిగా మెదళ్లలో నుండి తీసేసారు. ఫలితంగా తెలుసుకోవడాన్ని, వినడాన్ని ఓర్పుతో సహా కోల్పోయారు. అంతేనా ఏదైనా విషయం తెలిసిందీ అంటే అందులో తమ గురించి ఇతరులు ఎదో అన్నారు అని తెలిసిందంటే ఒకేసారి యుద్దానికి వెళ్లినట్టు వెళ్లి, గొడవ చేసి, రచ్చ చేసి కానీ వదిలిపెట్టరు. కానీ చివరకు ఒకోసారి తెలుస్తుంది అవగాహన లేకపోవడం వల్ల ఏదో అనేసుకున్నారు అని, అది కూడా అవగింజ అంత విషయాన్ని కొండంత చేసి చెప్పారని.


సుమతీ శతకకర్త పద్యంలో చెబుతాడు 

వినదగునెవ్వరు చెప్పిన 

వినినంతనే వేగపడక వివరింపదగున్

కనికల్ల నిజము దెలిసిన 

మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ!! అని


ఎవరు ఏమి చెప్పినా వినాలి అలా విన్న తరువాత ఆ చెప్పిన విషయంలో నిజమెంత అనేది తెలుసుకోవాలి, అలా తెలుసుకున్న తరువాత చెప్పిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. అలా నిదానంగా అన్నీ తెలుసుకున్నవాడే నీతివంతమైనవాడు ఈ ప్రపంచంలో అని అర్థం. 


కానీ అందరూ ప్రస్తుత కాలంలో ఏమి చేస్తున్నారు?? 


చాలామంది ఎవరైనా ఏదైనా చెబితే అనే మొదటి మాట అంతా తెలిసినట్టు బిల్డప్పు అని అంటారు. ఇది బయటకు అనకపోయినా మనసులో అయినా అనుకునేస్తారు. అంతేనా!! ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్పెయ్యగానే అందులో పొరపాటున తమ పేరు ఉంటే ఇక అయిపాయే!! ఉగ్రతాండవం చేస్తారు ఆ వ్యక్తి మీద. ఇంకా కొందరుంటారు వైరస్ లెక్కన. ఒక విషయం తెలియగానే అందులో నిజానిజాలు, కారణాలు ఏమి తెలుసుకోకుండా వైరస్ ఎలాగైతే వ్యాపిస్తోందో అలా విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేస్తారు. అది కూడా మాములుగా కాదు, ఉన్న విషయానికి ఇంకాస్త తమలో ఉన్న నైపుణ్యం జోడించి చిలువలు పలువలు చేసి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదొక పైశాచిక ఆనందం వాళ్లకు.


ప్రస్తుత కాలం ఇట్లా ఏడ్చింది కాబట్టే మనుషుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇంకా అన్నిటికీ మించి స్నేహాభావం కూడా కరువయ్యింది. కనీసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య కూడా సరైన అవగాహన ఉండటం లేదు. వస్తువులకు, ఆర్థిక కలాపాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనుషుల విషయంలో  ఇవ్వడం లేదు. 


ఒకసారి ఓపిక తెచ్చుకోవాలి


ఒకసారి ఎదుటివారి మాట వినాలి


ఒకసారి నిజానిజాలు గ్రహించాలి


ఆ తరువాత అన్నీ అర్థమవుతాయి


మనుషులే కాదు


ప్రపంచం కూడా…..

◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.