ప్రేమా? ద్వేషమా? మీరే నిర్ణయించుకోండి!

Publish Date:May 27, 2019

Advertisement

 

 

ఒక బడిలో పిల్లలు నిరంతరం గొడవలుపడుతూ, కొట్టుకుంటూ ఉండేవారు. పిల్లలంతా చదువులో బాగున్నారు, ఆటపాటల్లో బాగున్నారు. కానీ వారిలో సంస్కారం మాత్రం లేదని ఉపాధ్యాయులంతా తెగ బాధపడేవారు. ఇంత చిన్న వయసులోనే ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారంటూ దిగాలు పడిపోయేవారు.

పిల్లల తీరు మార్చేందుకు ఎవరెన్ని మంచి మాటలు చెప్పినా ప్రభావం లేకుండా పోయింది. చివరికి ఓ ఉపాధ్యాయుడికి ఓ ఆలోచన తట్టింది. మర్నాడు తన తరగతిలో అడుగుపెడుతూనే ఆ ఉపాధ్యాయుడు ‘నేను మీతో ఓ సరదా ప్రయోగం చేయించాలనుకుంటున్నాను. ఈ ప్రయోగాన్ని చివరివరకూ చేసినవారికి పరీక్షలలో ఐదేసి మార్కులు కలుపుతాను,’ అన్నాడు.

ప్రయోగం, మార్కులు అనగానే పిల్లలంతా ఉత్సాహంగా తల ఊపారు. ‘మీకు ఈ ప్రపంచంలో కొందరు ఇష్టం ఉండకపోవచ్చు కదా! అలా మీకు ఎంతమందిమీద ద్వేషం ఉంటే అన్ని టమాటాలని రేపు తీసుకురండి,’ అని చెప్పాడు. టీచరుగారు చెప్పింది సరదాగానే ఉంది. దాంతో ఒకో విద్యార్థీ తనకి ఎందరి మీద ద్వేషం ఉందో అన్నేసి టమాటాలు తీసుకువచ్చాడు.

కొందరు మూడు టమాటాలతో సరిపెట్టుకున్నారు, కొందరు పది తెచ్చారు, ఇంకొందరు ఏకంగా ఇరవై టమాటాలు మోసుకువచ్చారు. ‘వెరీ గుడ్‌! మీరు తెచ్చిన టమాటాలన్నీ మీ డెస్క్‌లో పెట్టుకోండి. ఒక వారం గడిచాక వాటిని తీసేయవచ్చు. ఇదే మీరు చేయబోయే ప్రయోగం,’ అన్నారు టీచరుగారు.

టీచరుగారి మాటలకు పిల్లలు పగలబడి నవ్వారు. ఇది కూడా ఓ ప్రయోగమేనా! అంటూ గుసగుసలాడుతూ  ఎగతాళి చేశారు. కానీ ఎంతైనా టీచరు కదా! అందుకని మారుమాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేశారు.

ఓ రెండు రోజులు అంతా బాగానే ఉంది. కానీ తర్వాత మొదలైంది అసలు కథ! డెస్క్‌లో టామాటాలు గభాలున చేయి తగిలితే పగిలిపోయేవి. మరికొన్ని కుళ్లపోయేవి. దాంతో పుస్తకాలు పెట్టుకోవడానికి కాదు కదా! కనీసం తలుపు తెరిచి చూడ్డానికి కూడా విద్యార్థులకి భయం వేసిపోయింది. ఎక్కువ టమాటాలు ఉన్నవారి బాధ మరింత ఎక్కువగా ఉంది.

వాళ్లు బడికి రావడానికే భయపడిపోయారు. డెస్క్‌ మీద చేయి వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఇలా వారం రోజులూ క్షణమొక యుగంగా గడిచాయి. చివరి రోజుకి పిల్లలంతా బిక్కచచ్చిపోయి ఉన్నారు.

‘నేను చెప్పినట్లుగానే ప్రయోగం కోసం మీరంతా వారం పాటు టమాటాలను మీ దగ్గర ఉంచుకున్నారు. ఈ పరీక్షలో మీరంతా నెగ్గారు కాబట్టి మీ అందరికీ ఐదేసి మార్కులు ఇస్తున్నాను. కానీ మార్కులకి మించిన పాఠం ఒకటి మీరు తెలుసుకోవాల్సి ఉంది,’ అన్నారు టీచరుగారు చిరునవ్వుతో!


టీచరు మాటలకి విద్యార్థులందరూ నోరువెళ్లబెట్టుకొని చూశారు. వాళ్లని చూస్తూ టీచరుగారు ఇలా చెప్పారు... ‘మీరు ఏర్పరుచుకున్న ద్వేషాలు మీ డెస్క్‌లో ఉన్న టమాటాలులాంటివి.

ఎంతమంది మీద ద్వేషం ఏర్పరుచుకుంటే మీ మనసులో అంత దుర్గంధం చేరుతుంది. చూసేవాళ్లకి కూడా మీ మనసు అంత స్వచ్ఛంగా లేదన్న విషయం అర్థమైపోతుంది. క్రమంగా అంతా మీ నుంచి దూరమైపోతారు. కొన్నాళ్లకి మీరే మీకు అర్థం కాకుండా పోతారు.

మనసులో ఏదో తెలియని బరువు, చిరాకు మాత్రమే మిగులుతాయి. ప్రేమ, కరుణలాంటి గుణాలు దూరమైపోతాయి. ద్వేషంతో మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోవాలా? ప్రేమతో ఈ ప్రపంచాన్ని జయించాలా?’ మీరే నిర్ణయించుకోండి అంటూ ముగించారు టీచరుగారు. ఆయన మాటలు విన్న విద్యార్థులంతా ఆలోచనలో మునిగిపోయారు.


(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.

 

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.