ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారం (మార్చి 31) కొట్టివేసింది. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్, మంత్రి నారాయణలపై అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఐఆర్ఆర్ అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని సీఐడీ సమర్పించిన క్లోజర్ రిపోర్ట్ను న్యాయస్థానం అధికారికంగా ఆమోదించింది.
జగన్ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
అయితే.. రాష్ట్రంలో జగన్ అధికారం కోల్పోయి.. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటు చేసుకుంది. గతంలో జరిగిన విచారణ సరళిని సమీక్షించిన సీఐడీ అధికారులు.. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లభించలేదని నిర్ధారించారు. దీంతో ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద పరిగణించి మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో ఫైనల్ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు.
సీఐడీ సమర్పించిన నివేదికను సవాల్ చేస్తూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను విచారించిన ఏసీబీ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం సీఐడీ దర్యాప్తు నివేదికతో ఏకీభవిస్తూ, చంద్రబాబు సహా ఇతరులపై ఉన్న కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
గతంలో కూడా ఈ కేసు విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పలుమార్లు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిం చారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు చుక్కుదురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏసీబీ కోర్టు ఐఆర్ఆర్ కేసు కోట్టివేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవని ఈ తీర్పుతో స్పష్టమైందని న్యాయ నిపుణులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/inner-ring-road-case-dismissed-39-216500.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.