మరణ మృదంగం..

Publish Date:Jun 29, 2016

Advertisement

పసికూనల బోసినవ్వులు విరబూయాల్సిన చోట మరణ మృదంగం మోగుతోంది..పురిటి నొప్పుల బాధను ఇంకా మరచిపోని ఆ తల్లులకు తీరని వ్యధే మిగులుతోంది. భారత్‌లో శిశు మరణాల రేటు ఆందోళన కలిగిస్తోందని..ప్రతి రోజు కొన్ని వేల మంది చిన్నారులు మరణిస్తున్నారు. ఈ విషయం ఎవరో చెబుతోంది కాదు..సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి.. భారత్ సహా పలు వర్థమాన దేశాల్లో నిర్వహించిన సర్వే ఈ నిజాలను బట్టబయలు చేస్తోంది.

 

భారత్‌లో పుట్టిన వెయ్యిమంది పసికందుల్లో 60 మంది ఏడాదిలోపు చనిపోతుంటే, మిగిలిన వారిలో సగం పోషకాహార లోపంతో మృత్యువాత పడుతున్నారు. అలా..ఏటా 1.45 మిలియన్ల మంది పిల్లలు పుట్టిన రెండు మూడు సంవత్సరాలకే తనువు చాలిస్తున్నారని ఐరాస తెలిపింది. పేద పిల్లల సంక్షేమంపై దృష్టిపెట్టకపోతే ప్రపంచ వ్యాప్తంగా 2016-2030 మధ్య 6.9 కోట్ల శిశు మరణాలు సంభవిస్తాయని..అందులో సగానికి పైగా భారత్, నైజీరియా, పాకిస్థాన్, కాంగో, అంగోలాల్లోనే చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఒక్క భారత్‌లోనే ఇందులో 17 శాతం మరణాలు సంభవిస్తున్నాయని హెచ్చరించింది.

 

ప్రపంచ వ్యాప్తంగా "బాలల స్థితి వార్షిక నివేదిక"ను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ "యూనిసెఫ్" విడుదల చేసింది. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు 1990తో పోలిస్తే సగానికిపైగా తగ్గినట్లు యూనిసెఫ్ తెలిపింది. 129 దేశాల్లో బాల, బాలికలు సమాన సంఖ్యలో ప్రాథమిక పాఠశాలలకు హాజరవుతున్నట్టు పేర్కొంది. పేదరికంలో మగ్గుతున్న చిన్నారుల శాతం సగానికి తగ్గినట్టు వెల్లడించింది. ధనిక వర్గాలతో పోలిస్తే..పేద పిల్లలు ఐదేళ్లలోపు మృత్యువాతపడటం, తీవ్ర పోషకాహార లోపాల బారినపడటం వంటి ముప్పు రెట్టింపు అయినట్లు తెలిపింది. పేద పిల్లల సంక్షేమంపై ప్రభుత్వాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు దృష్టిపెట్టాలని పిలుపునిచ్చింది.

 

భారత్‌లో శిశుమరణాల రేటును తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ఏటా కోట్లు కేటాయిస్తున్నా, నిధులను సరిగా ఖర్చు చేయడంలో రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పునురుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద కేటాయిస్తున్న నిధుల్లో సింహభాగం సిబ్బంది జీతభత్యాలకు ఖర్చు చేస్తున్నారే తప్ప చిన్నారుల ఆరోగ్యం మెరుగుకు ప్రణాళికలేవీ రూపొందించడం లేదు. అయితే శిశు మరణాలపై ప్రజాసంఘాల వాదన మరోలా ఉంది. చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని అవి ఆరోపిస్తున్నాయి. చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మౌలిక వసతులు లేకపోవడంతో శిశుమరణాలు పెరిగిపోతున్నాయి.

 

వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం నిద్రపోతుండటంతో తల్లులకు కడుపు కోతే మిగులుతోంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో నిలోఫర్ ఆసుపత్రితో పాటు జీజీహెచ్, కేజీహెచ్ తదితర ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించకుంటే పురిటి నొప్పులతో విలవిల్లాడుతూ మృత్యుముఖంలోంచి బయటికొచ్చిన తల్లిని మృతశిశువు వెక్కిరిస్తూనే ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.