Publish Date:May 23, 2022
దావోస్ లో జగన్ తనకు అలవాటైన అబద్ధాల ప్రచారాన్ని మరో లెవెల్ కు తీసుకు వెళుతున్నారు. వాస్తవానికి దావోస్ లో ఏపీ ఉనికిని గుర్తించేందుకు కూడా పారిశ్రామిక వేత్తలు ముందుకు రాని పరిస్థితి ఉంది. కానీ ఏపీలో లాగే దావోస్ లో కూడా జగన్ అబద్ధాల తెర వెనుక గడిపేస్తున్నారు. దావోస్ లో ఏపీ వైపు చూసిన పారిశ్రామిక వేత్తలే లేరంటే అతిశయోక్తి కాదు. అసలు దావోస్ కు జగన్ పర్యటన పెట్టుబడుల కోసం కాదనీ, వేరే వ్యక్తిగతమైన వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు విదేశీ పర్యటన కోసమే దావోస్ ను ఒక సాకుగా చూపారనీ తొలి నుంచీ విమర్శలు వస్తునే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన దావోస్ చేరుకోవడానికి ముందు లండన్ లో ల్యాండ్ కావడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. అలాగే జగన్ దావోస్ కు బయలుదేరడానికి చాలా రోజుల ముందుగానే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కుండ బద్దలు కొట్టేశారు. జగన్ దావోస్ ఆర్థిక సదస్సులో పాల్గొన్నంత మాత్రాన పెట్టుబడులు వచ్చి పడిపోతాయన్న భ్రమలు వద్దని ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు.
అయితే దావోస్ లో జగన్, ఆయన వెంట వెళ్లిన బృందం మాత్రం ఏపీకి అక్కడ పారిశ్రామిక వేత్తలు బ్రహ్మరథం పట్టేస్తున్నారన్నట్టు బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ దావోస్ లో జగన్ బృందంతో చర్చలు జరిపిన కంపెనీ ఏదయ్యా అంటే.. మూడు రాజధానుల మాటకు జగన్ కు వంత పాడిన బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ). ఈ బీసీజీ గ్రూప్ కొత్తదేం కాదు. ఏపీలో ఆ గ్రూప్ తన తీరుతో ఎంతగా భ్రష్టుపట్టిందో అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల కోసం జగన్ నియమించుకున్నది ఆ గ్రూప్ నే. ఆ గ్రూపు నివేదిక ఇవ్వడానికి ముందే.. జగన్ నోటి వెంట మూడు రాజధానుల నిర్ణయం వెలువడింది. ఆ తరువాత తీరిగ్గా బీసీజీ గ్రూపు జగన్ చెప్పిన మాటలను చిలకలా వల్లె వేసింది. బీసీజీ గ్రూపు మూడు రాజధానులకు అనుకూలంగా ఇచ్చిన నివేదికపై చాలా మంది కోర్టుకు వెళ్లారు. మరింత మంది పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు.
ఇప్పుడు దావోస్ లో ఆ సంస్థ చైర్మనే పాత పరిచయంతో జగన్ తో భేటీ అయ్యారు. మూడు రాజధానులకు అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లుగానే... ఇక్కడ కూడా జగన్ ఏం కావాలో అదే మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానం భవిష్యత్ లో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తడానికి దోహదపడుతుందన్నది బీసీజీ గ్రూప్ చైర్మన్ ప్రసంగ సారాంశం. ఇక దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ మాత్రమే. అలాగే ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా జగన్ తో భేటీ అయ్యారు.
వీరి మధ్య పెట్టుబడుల అంశం కాకుండా గౌతమ్ అదానీ భార్యకు జగన్ ఇవ్వచూపిన రాజ్యసభ టికెట్ ను నిరాకరించడంపైనే చర్చ జరిగిందన్నది వైసీపీ వర్గాల కథకం. వీరు కాకుండా జగన్ కేసి కానీ, ఏపీ వైపు కానీ చూసిన పారిశ్రామిక వేత్త లేరు. అయినా జగన్ బృందం జగన్ దావోస్ పర్యటనను ఆహా, ఓహోలతో పొగిడేస్తూ లేని సీన్ ఉందని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/industrialists-keep-distance-with-jagan-in-davoos-25-136335.html
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.