Publish Date:May 14, 2025
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మోడీ సర్కార్ అంగీకరించడంపై దేశం రగిలిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో 1971 యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెగువ.. సాహసం గుర్తు చేసుకుంటూ.. మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అమోరికా ఒత్తిడిని లెక్క చేయకపోవడమే కాకుండా, ఆ దేశ హెచ్చరికలను, ఆంక్షల బెదరింపులను లెక్క చేయకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అద్భుత దౌత్యం నెరపడమే కాకుండా పాకిస్థాన్ పీచమణిచిన తీరును ప్రస్తుతిస్తున్నారు.
పాకిస్తాన్పై అన్ని విధాలుగా పై చేయి సాధించి కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన మోడీ తీరును గర్హిస్తూ.. నాడు అంటే 1971 యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు పాక్ తో యుద్ధం ఆపాలని ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఇందిరా గాంధీ పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో భారత్ , పాకిస్థాన్ మధ్య ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఇంత తేడా లేదు. దాదాపు ఇరు దేశాలూ సమాన స్థాయిలో ఉన్నాయి. అప్పట్లో అయితే అమెరికా ఎలాంటి దాపరికం లేకుండా పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచింది. అయినా సరే ఇందిరా గాంధీ అగ్రరాజ్యం అభ్యంతరాలను, ఒత్తిడినీ తోసిరాజని గట్టిగా నిలబడింది. అదే ఇప్పుడు.. పాకిస్థాన్ ఒక చితికిపోయిన దేశం. ఏ రకంగానూ భారత్ తో సరితూగలేదు. ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకుని భారత్ లో అశాంతి, అల్లర్లు రేపాలన్న ప్రయత్నంలో ఉంది.
ఇన్ని సానుకూలతల మధ్య కూడా మోడీ అమెరికా ఒత్తిడికి తలొగ్గి.. ట్రంప్ చెప్పినదే తడవుగా బేషరతు కాల్పుల విరమణకు ఓకే చెప్పేశారు. కనీసం భారత్ లో దాడులకు సూత్రధారులైన మసూద్ అజర్ వంటి ఉగ్రవాదుల అప్పగింతకు కూడా డిమాండ్ చేయలేదు. అందుకే దేశమంతా ఇప్పుడు ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటోంది. గట్టిగా నిలబడి భారత్ సత్తాను చాటడంలో మోడీ వైఫల్యాన్ని ఎండగడుతోంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని ఎత్తి చూపుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indira-very-strong-even-in-adverse-conditions-39-198035.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.