ఆమెగా కాక... అమ్మగా చూడటమే... భారతీయ సంస్కృతి!

Publish Date:Oct 5, 2016

Advertisement

నవరాత్రులు నడుస్తున్నాయి. దసరాని తీసుకురాబోతున్నాయి. కాని, దసరా అంటే ఒక కొత్త జత బట్టలు, రెండు పూటలా పిండి వంటలు, మూడు , నాలుగు రోజుల హడావిడి... ఇంతేనా! ఖచ్చితంగా కాదు. భారతీయ సంస్కృతిలో నవరాత్రులు, వాటి చివర్న వచ్చే దసరా స్త్రీ శక్తికి సాష్టాంగ నమస్కారం! సమున్నత సత్కారం....    
దసరా అంటే సరదానే! కాని, సరదా మాత్రమే కాదు! దసరా అంటే దశ మార్చేది! దిశ నిర్ధేశించేది! కొత్త ప్రయాణం ప్రారంభింపజేసేది! అన్నిటికంటే ముఖ్యంగా, భారతదేశంలో యుగయుగాలుగా వస్తోన్న స్త్రీ ఆరాధనకి అతి పెద్ద సంబరం! అసలు ఇవాళ్ల మనం సూటిగా మాట్లాడుకుంటే మొత్తం ప్రపంచంలో స్త్రీ శక్తిని దైవంగా ఆరాధించటం కేవలం మన దేశంలో మాత్రమే జరుగుతోంది. హిందూ మతంలో మాత్రమే వుంది. ప్రపంచంలోని ఇతర ప్రముఖ మతాలైన ఇస్లాం, క్రిస్టియానిటి, బౌద్ధం వంటి వాటిల్లో స్త్రీ దేవతలు వుండరు. వున్నా వారికి తగినంత ప్రాముఖ్యత కనిపించదు. 
దసరా అంటే విజయదశమి. అది తొమ్మిది రొజుల పాటూ సాగిన శరన్నవరాత్రి ఉత్సవాలకి పరాకాష్ట! రోజుకో రూపంలో పూజలందుకున్న అమ్మవారు విజయదశమి నాటితో మహిషాసుర సంహారం పూర్తి చేసి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది! నిజంగా కూడా సృష్టిలో స్త్రీయే అసలు సిసలు విజయ సంకేతం! 
ఆమె ప్రత్యేకంగా కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. బంగాళాలు కట్టాల్సిన అగత్యం లేదు. వ్యాపారాలు చేసి తాపత్రయపడాల్సిన కారణమూ లేదు. తాను తనలా వుంటే చాలు విజయం సాధించినట్టే! ఎందుకంటే, స్త్రీ... పురుషుడు చేయలేని అతి గొప్ప కార్యమైన జన్మనివ్వటం అనే పని చేస్తుంది! తద్వారా ఈ యావత్ మానవజాతి విజయవంతంగా మనగలగటానికే ఆమె విజయ రహస్యం అవుతోంది! ఇక పుట్టిన బిడ్డ ఎన్నో నెలలు, ఏళ్ల పాటూ తల్లి మీదే ఆధారపడతాడు. తిండి కోసం, దాహం కోసం, రక్షణ కోసం, శిక్షణ కోసం... అన్నిటికి తల్లి మీదే బాధ్యత వేస్తుంది శిశువు! అయినా ఎంతో ప్రేమతో, మమకారంతో స్త్రీ పిల్లల్ని ఓపిగ్గా పెంచి పెద్ద చేస్తుంది. ఈ ఒక్క కర్తవ్యం ఆమెను అమ్మని చేస్తుంది. ఆ అమ్మని .... అమ్మలగన్నమ్మాగానూ చేస్తుంది!
నిత్య జీవితంలో మన చుట్టూ వుండే ఆడవాళ్ల బాధ్యతలు, త్యాగాలు, గొప్పతనాలే సనాతన ధర్మంలో స్త్రీ దేవతల ఆవిర్భావానికి కారణాలు. మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు స్త్రీని రతి దేవీ నుంచి కాళికా దేవీ వరకూ అన్ని కోణాల్లోనూ ఆవిష్కరించాయి. మహిళ అంటే కేవలం అందం, శృంగారం మాత్రమే కాదన్నది మన దేశంలో అనాదిగా వస్తోన్న అభిప్రాయం. అందుకు చక్కటి ఉదాహరణ రతీ, రంభా అంటూ స్త్రీలని చిత్రీకరించిన మన పురాణ కథలే లక్ష్మీ, సరస్వతి, కాళీ అంటూ కూడా చెప్పాయి. ఒకవైపు అందం, సున్నితత్వం, మోహం, మాయా వంటి వాటికి ఆడవార్ని సంకేతం చేసినప్పటికీ అదే స్త్రీని అమ్మగా చూడటం కూడా మన పెద్దలు చెప్పారు. ఐశ్వర్యానికి కూడా స్త్రీనే అధిష్టాన దైవంగా నిర్ణయించారు! లక్ష్మిగా సకల సంపదలు ఇచ్చేది అమ్మే! 
సంపదలకి, శుభాలకి స్త్రీనే ముఖ్యమని మనుస్మృతి కూడా చెబుతోంది. చాలా మంది ఎన్నో రకాల ఆరోపణలు చేసే మనుస్మృతిలో యత్ర నార్యంతు పూజ్యంతే అంటూ చెప్పాడు మనవు. దానర్థం నారి పూజింపబడితేనే దేవతలు నివసిస్తారనీ! దేవతలు అంటే శుభాలు, సంతోషాలు అనే! ఇంట్లో ఆడవాళ్లు దుఃఖిస్తూ వుంటే ఎంతటి ధనవంతుడైనా సుఖంగా, మనః శాంతితో వుండలేడు. అందుక్కారణం మగవాడి ఆనందం తల్లి, భార్య, కూతురు, తోబుట్టువుల రూపంలో వున్న స్త్రీయే! ఆమె లేకుంటే ఇల్లు నాలుగు గొడలుగా మాత్రమే మిగులుతుంది. స్త్రీ పురుషుడితో కలిసినప్పుడే అది కుటుంబం అవుతుంది. ఈ కారణం చేతనే మన వాళ్లు ఆడవార్ని గృహ లక్ష్మీ అన్నారు!
భారతదేశంలో స్త్రీ ఆరాధన జరుగుతోంది కాబట్టి, నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడందరూ చాలా భద్రంగా వున్నారని ఎవ్వరం అనలేం. కాని, నిర్భయ లాంటి దారుణాలు జరిగే మన దేశంలోనే సింధు లాంటి అమ్మాయిలు విశ్వ విజేతలుగా నిలిచి వస్తున్నారు. దీనికి కారణం మన సంస్కృతిలో అనాదిగా ఇమిడి వున్న శాక్తేయమే. అప్పుడప్పుడు చరిత్రలో ఆడవారి పట్ల అమానుషాలు జరుగుతూనే వున్నాయి. అది కాదనలేని సత్యం. ఒక దశలో సతీ లాంటి దురాచారాలు మహిళల్ని నిలువునా బలితీసుకుంటే ఇప్పుడు అత్యాచారాలు, గృహ హింస లాంటివి రాజ్యమేలుతున్నాయి. అయినా కూడా మిగతా ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు భారతీయ సంస్కృతి స్త్రీకి ఇచ్చిన మహోన్నత స్థానం అద్భుతమైంది. చాలా దేశాలు, ప్రాంతాల కంటే ఇక్కడ ఆడవారు కొనసాగించే జీవితం మేలైంది. ఒకవైపు మధ్య ప్రాచ్య దేశాలు, ఇస్లాం ప్రాబ్ల్యం వున్న దేశాలు, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఆడవారికి కనీస మానవ హక్కులు వుండటం లేదు. అటు పాశ్చాత్య దేశాల్లో మహిళల్ని పూర్తిగా మార్కెట్ వస్తువులుగా మార్చేస్తున్నారు. స్వేచ్ఛ వున్నా వెస్టన్ కంట్రీస్ లో స్త్రీ పట్ల ఆరాదన భావం తక్కువ. 
భారతదేశంలో స్త్రీకి దక్కే గౌరవం, స్వేచ్ఛ ఎంతో సంతృప్తికరం. అలాగని మనం ఆడవారి పట్ల అనుసరిస్తున్న కొన్ని విధానాలు మార్చుకునే పనిలేదని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు. కాకపోత, మనం మాతృ స్వరూపిణి అయిన స్త్రీ పట్ల మరింత గొప్పగా వ్యవహరించటానికి మనకు ప్రేరణంతా వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లోనే వుందని గ్రహించటమే ముఖ్యం! విద్యలకు అధిదేవతగా సరస్వతిని మన సంస్కృతిని చెబుతోంది. మరలాంటప్పడు ఆడపిల్లలకు చదువు వద్దని అనటం ఎంత అమానుషం! అలాగే, ప్రేమ స్వరూపం రాథా దేవీ. అటువంటి ప్రేమ స్వరూపిణి అయిన ఆడదాన్ని ఆడపిల్లగా వుండగానే భ్రణహత్యకు పాల్పడటం ఎంత కిరాతకం! ఇక శక్తికి మూలం దుర్గా, పార్వతి, గౌరీ, కాళీ అంటూ ఎన్నో పేర్లతో పిలవబడే అమ్మవారు! ఆమె లేకుంటే శివుడంతటి వాడు కూడా స్థబ్ధుగా, నిశ్చలంగా వుండిపోతాడంటోంది వేదాంతం! అంటే, ఈశ్వరుడిలోని సత్తువ కూడా ఆ అమ్మే! ఆ అన్నపూర్ణే! ఆమె లేకుంటే మనకు ఏం వుంటుంది? ప్రాణం మొదలు జీవితం వరకూ ఏదీ వుండదు! అయితే, మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటుంది... ఈ మొత్తం విశ్వాన్ని నడిపే విశ్వ శక్తి అయిన విశాలాక్షి మరెవరో కాదు... భూమ్మీది ప్రతీ మనిషికీ జన్మనిస్తూ అమ్మ అనిపించుకుంటోన్న ఆడదే! 'ఈమె'ని 'ఆమె'లా చూడటమే... అసలైన భారతీయ సనాతన సంస్కృతి!
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.