భారత వాయుసేన గగన గర్జన.. యుద్ధమైనా, విపత్తయినా హీరోలా ఎంట్రీ..

Publish Date:Oct 7, 2023

Advertisement

శత్రు మూకలతో యుద్ధమైనా, ప్రకృతి విపత్తులతో పోరాటమైనా.. సాయం అడగకుండానే గగనం నుంచి ఆపన్నహస్తాన్ని చాచే మన హీరో ఎవరంటే ‘భారతీయ వాయుసేన’ (Indian Airforce). కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది సిపాయిలతో ప్రస్థానం ప్రారంభించి నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వాయుసేనగా భారతదేశానికి భరోసా, శత్రుదేశాలకు దడ పుట్టించగల సత్తావున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేడు 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రతి ఏడాది అక్టోబర్ 8న నిర్వహించే ఈ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే విశిష్టత, చరిత్రను ఒకసారి గుర్తుచేసుకుందాం.

ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి..

భారత వైమానిక దళాన్ని స్థాపించిన తేదీ 8 అక్టోబర్ 1932ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే నిర్వహిస్తారు. నిజానికి భారత వైమానిక దళాన్ని బ్రిటీష్ పాలనాకాలం 1932లోనే స్థాపించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు సహాయక దళంగా భారత వాయుసేనను ఏర్పాటుచేశారు. మొదటి కార్యచరణ స్క్వాడ్రన్ ఏప్రిల్ 1933లో రూపుదిద్దుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ పేరుకు ముందు రాయల్ అనే ట్యాగ్‌ను జోడించారు. అప్పటి నుంచి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా పిలిచేవారు. అయితే 1950లో భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తిరిగి ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ పేరును స్వీకరించారు. 1933లో కేవలం ఆరుగురు అధికారులు, 19 మంది హవాయ్ సిపాయిలతో ఏర్పాటైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ క్రమక్రమంగా తన శక్తిసామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ నేడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద క్రియాశీల వైమానిక దళంగా రూపుదిద్దుకుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  అనేక సేవలు అందించింది. అనేక యుద్ధాలలో పాలుపంచుకుంది. పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధాలు, చైనాతో జరిగిన ఒక యుద్ధం ఎంతో ముఖ్యమైనవి. ఒక్క యుద్ధాలే కాకుండా భారత భూభాగానికి అన్ని వేళలా పహారాకాయడం, గగనతలాన్ని సదా సంరక్షించడం, దేశ ప్రయోజనాలను కాపాడటంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో దేశానికి విశిష్టమైన సేవలు అందిస్తోంది. నిరంతరాయంగా నిస్వార్థ సేవలను దేశానికి అందిస్తోంది. వాయుసేన సేవలను గౌరవిస్తూ ప్రతి ఏడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే ఘనంగా నిర్వహిస్తుంటారు. ఎంతో ముఖ్యమైన ఈ రోజున వైమానిక దళ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక వైమానిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.

మరింత దృఢంగా, పటిష్టంగా..

భారత సాయుధ దళాలలో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి యుద్ధ, విపత్కర పరిస్థితులనైనా అలవోకగా ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా పటిష్టతపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా వాయుసేనలో అధునాతన టెక్నాలజీతో కూడిన విమానాలను ప్రవేశపెడుతోంది. విమానాల తయారీలో దేశీయ టెక్నాలజీ వినియోగించడంతోపాటు కొత్త సాంకేతికతతో కూడిన విమానాలను పలు దేశాల నుంచి సేకరిస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. మరోవైపు నియామకాలపై కూడా శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా వాయుసేన మహిళలకు కూడా విశిష్ట ప్రాధాన్యతను కల్పిస్తుండడం మనమంతా గర్వించదగిన అంశం. మొత్తంగా..  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దినోత్సవాన మన వాయుసేన మరింత పటిష్టంగా,  శత్రువులకు వణుకు పుట్టించేలా రూపాంతరం చెందాలని ఆకాంక్షిస్తూ ఎయిర్‌ఫోర్స్ హీరోలకు ఒక సెల్యూట్ చేద్దాం..


                                          *నిశ్శబ్ద.

By
en-us Political News

  
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.