ఆకాశమే హద్దుగా భారత వైమానిక దళం!

Publish Date:Oct 8, 2022

Advertisement

రక్షణ అనేది ప్రతి దేశానికి అవసరం. ప్రపంచంలో ఎన్నో దేశాలు రక్షణ పరంగా బలంగా ఉండటం వల్ల పక్కదేశం వాడు దాడి చేయకుండా ఉండగలుగుతున్నాడు. ఒకప్పటి కాలంలో రాజులు కోట రక్షణ కోసం, తమ రాజ్యాన్ని పక్క రాజ్యం వాడు దండెత్తి వచ్చి లాక్కోకుండా ఉండటం కోసం సైన్య బలాన్ని పెంచుకుంటూ ఉండేవారు. అయితే రాచరిక వ్యవస్థ పోయాక ఈ రక్షణ వ్యవస్థ క్రమంగా మరుగున పడింది. బ్రిటిషు వారి చేతుల్లో నలిగాక భారతదేశానికి రక్షణ వ్యవస్థ అవసరం మళ్ళీ తెలిసొచ్చింది. జల, వైమానిక, సైనిక దళాల వైపు అడుగులు పడిన కారణంగా నేడు భారతదేశ రక్షణ దళం ప్రపంచంలో పటిష్టమైనదిగా ఆవిర్భవించింది. అంతేకాదు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది కూడా. 

అసలు ఎయిర్ ఫోర్స్ డే ఎలా ఏర్పడింది?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రాయల్ ఎయిర్ ఫోర్స్ గా పిలిచేవారు. ఇది ఏర్పడినప్పుడు దీనిలో కేవలం ఆరుమంది సభ్యులు, 19 మంది సైనికులు ఉన్నారు అనే విషయం విస్మయం కలిగించినా వీరి ప్రయాణం నేడు ఒక గొప్ప శక్తిగా మారిందంటే ఎంత కృషి చేసి ఉండాలో అర్థమవుతుంది. ఈ సభ్యుల దగ్గర నాలుగు వెస్ట్ ల్యాండ్ వ్యాపిటి IIA ఆర్మీ ప్లైన్ లు ఉండేవి. అప్పటికి ప్రపంచంలో ఇతర దేశాలలో డజన్ల కొద్దీ యుద్దవిమానాలు, ప్లైన్ లు ఉండేవి, వీటితో పోలిస్తే భారతదేశం దగ్గరున్నవి చాలా తక్కువ. అయినా భారతదేశం వాటిని అభివృద్ధి చేసుకోవడంలో సఫలం అయింది. 1936, 1938 సంవత్సరాలలో  వీటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి భారత వాయు దళం చాలా శక్తివంతగా రూపు మార్చుకుంది. 

1941 సంవత్సరం తరువాత శిక్షణా నిర్వహణలు ఎంతో వేగం పుంజుకున్నాయి. శిక్షణ కోసం క్లబ్ లు ఏర్పాటుచేయడం, యువ రక్తాన్ని ఈ వర్గంలో భాగస్వామ్యం చేయడం వంటి చర్యల వల్ల భారత వైమానికదళం పటిష్టత పొందింది.

1932 అక్టోబర్ 8 వ తేదీన స్థాపించబడిన భారత వైమానిక దళం ప్రస్తుతం 90 వ ఎయిర్ ఫోర్స్ డే సైలెబ్రేషన్ ని జరుపుకోబోతోంది. యుద్ధాలలోనూ, రక్షణ వ్యవస్థ తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషించే వాయుదళం తన విజయాలను గుర్తుచేసుకుంటూ, అమరవీరులకు నివాళులు అర్పిస్తూ దేశమంతా చాటిచెబుతుంది. 

భారత వాయుదళం గురించి!

ప్రతి సంవత్సరం ఒక్కో చోట భారత వాయుదళం వేడుకలు జరపడం సాధారణం. 2022 సంవత్సరం అక్టోబర్ 8 న జరుగుతున్న ఈ వేడుకలకు చండీఘర్ వేదిక అయింది.

వాయు దళం తన బలాన్ని ప్రదర్శిస్తూ విన్యాసాలు చేస్తుంది. దీనికోసం ముందుగుగానే సన్నాహాలు చేస్తోంది, గొప్ప సాధన వీరి సొంతం కూడా.  ఆకాశంలో అద్భుతం చేసే ఈ విన్యాసాలు చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈసారి జరుగుతున్న  ఎయిర్ షోలో 83 విమానాలు పాల్గొంటాయి.  ఎయిర్ షోలో పాల్గొనే విమానంలో 44 యుద్ధ విమానాలు, 7 రవాణా విమానాలు, 20 హెలికాప్టర్లు ఇంకా 7 పాతకాలపు విమానాలు ఉన్నాయి.  అదే సమయంలో 9 విమానాలను సిద్ధంగా ఉంచుతారు. ఒకో సంవత్సరం ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈసారి ఎయిర్ షో ప్రత్యేకత ఏంటంటే.. కొత్త తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కూడా ఇందులో చేర్చనున్నారు.

ప్రతి వర్గానికి ఒక నినాదం అంటూ ఉంటుంది. అలాగే ప్రతి దేశానికి కూడా నినాదం ఉంటుంది. అలాగే భారత వాయుదళానికి కూడా ఓ నినాదముంది. ఈ నినాదం వెనుక ఒక ఆసక్తికర విషయముంది.

"నభః స్పృషం దీప్తమ్"  అనేది భారత వైమానిక దళం యొక్క నినాదం. ఇది గీతలోని పదకొండవ అధ్యాయం నుండి తీసుకోబడింది. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య ఉపదేశమే ఈ నినాదం వెనుక కారణం. ఈ నినాదంతోనే భారత వైమానిక దళం తన విధులను నిర్వహిస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ముఖ్యవిషయాలు!

భారత వైమానిక దళం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద వైమానిక దళం.  యుపిలోని ఘజియాబాద్‌లో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్దది.

IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థం. భారత వైమానిక దళం వివిధ కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.  వీటిలో ఆపరేషన్ పూమలై, విజయ్, మేఘదూత్ మొదలైనవి ఉన్నాయి.

భారత వైమానిక దళం IAF ఐక్యరాజ్యసమితితో శాంతి పరిరక్షణ మిషన్లలో కూడా పనిచేస్తుంది.

భారత వైమానిక దళాన్ని గతంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పిలిచేవారు.  ఈ పేరు స్వాతంత్ర్యం వరకు ఉన్నప్పటికీ,  స్వాతంత్య్రానంతరం రాయల్ అనే పదాన్ని తొలగించారు.

IAFలో అధిక సంఖ్యలో మహిళా ఫైటర్ పైలట్లు, మహిళా నావిగేటర్లు, మహిళా అధికారులు ఉన్నారు, వీరు భారత వైమానిక దళానికి తమ సేవలను అందిస్తారు.  భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫ్లీట్‌లో కూడా మహిళా ఫైటర్ పైలట్ ఉన్నారు.

దేశంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారత వైమానిక దళం ఎల్లప్పుడూ సహాయక చర్యల్లో పాల్గొంటుంది.  వీటిలో గుజరాత్ తుఫాను(1998), సునామీ (2004), ఉత్తర భారతదేశంలోని వరదలు ఉన్నాయి.  అయితే, ఉత్తరాఖండ్‌లో వరదల సమయంలో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడం ద్వారా IAF ప్రపంచ రికార్డు సృష్టించింది.  ఈ మిషన్‌కు 'రాహత్' అని పేరు పెట్టారు, ఈ సమయంలో భారత వైమానిక దళం దాదాపు 20,000 మందిని రక్షించింది.

ఇలా భారత వైమానిక దళం ఆకాశమే హద్దుగా ప్రపంచంలో గొప్పగా ఎదిగి దేశానికి అన్ని వేళల్లో నేనున్నానని భరోసా ఇస్తుంది. భారత వైమానిక దళానికి సెల్యూట్ చేయాలి మరి.


                                       ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే...
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు...
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.