ఇండియా vs ఎన్డీయే!

Publish Date:Jul 19, 2023

Advertisement

దేశంలో అసలు సిసలైన ఎన్నికల వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగా.. అధికార,ప్రతిపక్షాలు ఇప్పుడే సమర శంఖం ఊదేశాయి. ప్రతిపక్షం, అధికార కూటమి రెండూ ఒకదానిపై మరొకటి పై చేయి సాధించేందుకు కొత్త నిబంధనలను రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టాయి. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయేని ఢీ కొట్టాలని చూస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా (ఇండియన్, నేషనల్, డెవలప్‌మెంట్, ఇన్‌క్లూజివ్, అలయన్స్) పేరిట వజ్రాయుధాన్ని సిద్ధం చేసింది.

స్వయంగా రాహుల్ గాంధీనే తమ కూటమికి ఐఎన్డీఐఏ పేరును సూచించారు. దీనిని కూటమి పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తమ కూటమి పేరును ఇండియాగా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ప్రధానమంత్రి కూడా ఎన్డీయేకి న్యూ ఇండియా, డెవలప్డ్ నేషన్, యాస్పిరేషన్ ఆఫ్ ఇండియాగా కొత్త అర్ధాన్ని తెరమీదకి తెచ్చారు. కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్‌  సహా 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి సమావేశం నిర్వహించగా..  ఢిల్లీలో జరిగిన ఎన్‌డిఎ సమావేశానికి బీజేపీతో సహా 38 పార్టీలు హాజరయ్యాయి. మంత్రి అమిత్ షా ఇది తమ బలప్రదర్శన అని ముందే ప్రకటించి రాజకీయ చతురతకి తెరలేపారు.

ఒకవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశం,  మరోవైపు అధికార పక్షం ఎన్డీయే సమావేశాలు జరగడాన్ని దేశ రాజకీయాలలో కీలక పరిణామాలుగా పరిశీలకులు విశ్లేషించారు. అధికార, ప్రతిపక్ష కూటములు పోటాపొటీగా బలోపేతం అవుతున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అనే దానిపై అప్పుడే విశ్లేషణలు జోరందుకున్నాయి. రెండు కూటములలో అంతర్గతంగా జరిగే విషయాల్ని పక్కన పెడితే ఇరు పార్లమెంట్, అసెంబ్లీల్లో ఓట్లు, సీట్లను బట్టి ఈ రెండు కూటముల బలాబలాలపై చర్చ జరుగుతున్నది. వీటి ఆధారంగా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటముల గురించీ చర్చ జరుగుతోంది. ఇరు కూటములలోని నేతలు ప్రత్యర్థి కూటములపై సవాళ్లు విసురుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతూ రెచ్చిపోతున్నారు. 

దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మేమంతా చేతులు కలిపామని ప్రకటించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్డీయే  ఇండియాను సవాలు చేయగలదా అని  ప్రశ్నించారు. ఇప్పటి వరకూ యూపీఏ, ఎన్‌డీఏ గురించి విన్నారు.. కానీ,   బీజేపీ,  భారత్‌ను సవాలు చేయగలరా? మేము మా మాతృభూమిని ప్రేమిస్తున్నాం.. మేము దేశభక్తులం’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్దాంతాలపైనే విపక్ష కూటమి పోరాటం చేస్తున్నదని.. ఇది బీజేపీ, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కాదు, దేశ ప్రజల స్వతంత్రం, స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అధికారం కోసం దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎదుర్కొనే తమ పోరాటం ఎన్డీయే వర్సెస్ ఇండియాగా ఉంటుందన్నారు. ఈ కూటముల మధ్య యుద్ధం ఏ అంశంపై ఉంటుందో ప్రతిపక్ష కూటమి నేతల మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. 

వాస్తవానికి మన దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండే బలమైన పార్టీలు.   అయితే ఈ రెండు కూటములలో ఉన్న పార్టీలను గమనిస్తే మాత్రం బీజేపీ వెనుక ఉన్న పార్టీలలో అత్యధిక పార్టీలు అటు పార్లమెంటులో కానీ ఇటు రాష్ట్రాల అసెంబ్లీలలో కనీ కనీస ప్రాతినిథ్యం లేనివీ, ఉన్నా ఒకటీ అరా సీట్లు కలిగినవీ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కూటమిలో అంటే ఇండియా భాగస్వామ్య పక్షంలో అయితే రాష్ట్రాలలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న బలమైన పార్టీలు ఉన్నాయి.

ఇప్పటి వరకూ వీటి మధ్య ఐక్యతా లోపం వల్ల మాత్రమే బీజేపీ గత రెండు ఎన్నికలలో విజయం సాధించగలిగిదని పరిశీలకులు అంటున్నారు. ఆ అనైక్యత మటుమాయమై విపక్షాలన్నీ ఇండియాగా ఐక్యం కావడంతో బీజేపీలో ఒకింత కంగారు ప్రారంభమైందని అంటున్నారు. ఆ ఐక్యత సాకారం అవుతోందన్న సంకేతాల నేపథ్యంలోనే బీజేపీ హడావుడిగా ఈ తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే సమావేశంతో బలప్రదర్శనకు దిగిందని అంటున్నారు. మొత్తం మీద విపక్షాలు ఐక్యతారాగం వినిపించడంతో అధికార బీజేపీలో కంగారు మొదలైందని చెప్పవచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎన్డీయే వర్సెస్ ఇండియాగా హోరాహోరీగా జరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.