Publish Date:May 11, 2025
భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్రత యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. పహల్గాం దాడి తరువాత నుంచీ పరిస్థితి తీవ్రంగా మారింది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పకిస్థాన్ ను వణికించేసింది. పాక్ దాడులకు తెగబడినా భారత్ వాటిని అత్యంత సమర్దంగా తిప్పి కొట్టడమే కాకుండా ప్రతిదాడులు చేసింది. ఈ ప్రతిదాడులు పాకిస్థాన్ అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేశాయి. ఈ పరిస్థితిలో స్పష్టమైన స్వార్థ పూరిత కారణాలతో ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఏకపక్షంగా పూనుకుని కాల్పుల విరమణ ఒప్పందం అంటూ ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలను సడలించేందుకు ప్రయత్నించారు. భారత్ మాత్రం కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ క్రెడిట్ ఏమీ లేదనీ, అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమనీ తేల్చి చెప్పింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకే తాము మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామనీ చాటింది. అయితే ఈ ఒప్పందం అమలులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పాక్ నుంచి ఉల్లంఘన జరిగింది. దీంతో భారత్ దీటుగా స్పందించింది. ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి బుల్లెట్ వస్తూ మీరు క్షిపణితో సమాధానం ఇవ్వండి అంటూ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
దీంతో పాకిస్థాన్ కు ఇక శరణుజొచ్చడం వినా మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. అన్నిటి కంటే పాక్ సరిస్థితి దయనీయతకు త్రివిధ దళాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన అద్దం పట్టింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా తొలుత పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేశామనీ, ఆ తరువాత పాక్ సరిహద్దులలో భారత భూభాగంపై చేసిన దాడులకు ప్రతిగా పాక్ లోని ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించాయి. అంతే కాకుండా ఈ దాడుల్లో పాక్ సైనిక స్థావరాలు ధ్వంసమైన వీడియో క్లిప్పింగ్ లను చూపాయి.
పాక్ చేసిన ప్రతి దాడినీ సమర్ధంగా తిప్పికొట్టినట్లు త్రివధ దళాల ప్రతినిథులు తెలిపారు. పాక్ ఏ మాత్రం తోక జాడించినా ముప్పేట దాడికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. పాక్ పై చర్యలపై విషయంలోకేంద్ర ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తానే మొదట కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదించిందని, దానికి భారత్ అంగీకరించిందని, అయితే ఆ దేశమే ముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందనీ, మరోసారి ఆ పని చేస్తే భారత్ నుంచి ఎదురయ్యే దాడుల ప్రభావం తీవ్రాతితీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-strong-warning-to-pak-39-197905.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.