Publish Date:May 16, 2025
నమ్మక ద్రోహానికీ, విశ్వాస ఘాతుకానికీ పాల్పడిన టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశ సంస్థ సెలిబి ఏవియేషన్ కు భద్రత అనుమతిని రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్థాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో భారీ భూకంపంలో టర్కీ దయనీయ స్థితిలో ఉన్న సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అపత్సమయంలో ఆపన్న హస్తం అందించిన భారత్ విషయంలో టర్కీ వ్యవహరించిన తీరుకు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇండియాలో అయితే టర్కీ ఉత్పత్తులు, కంపెనీలను బ్యాన్ చేయాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా పాలు పోసిన చేతినే పాములా కాటేసిన టర్కీకి ఇండియా గట్టి గుణపాఠం చెప్పింది. టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్కు భద్రతా అనుమతిని భారత్ రద్దు చేసింది. టర్కీకి చెందిన సెలిబి ఏవియేషన్ సంస్థ భారత్ లోని తొమ్మిది విమానాశ్రయాలలో హై సెక్యూరిటీ పనులను నిర్వహిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన భద్రతా అనుమతిని భారత ప్రభుత్వం రద్దు చేసింది.
ఉగ్రవాదానికి దన్నుగా నిలిచిన పాకిస్థాన్ కు టర్కీ మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ చర్య తీసుకుంది. అంతే కాదు ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలను తెంచుకోబోతోందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. తొట్టతొలిగా జాతీయ భద్రత దృష్ట్యా టర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్ భద్రతా అనుమతిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1958లో స్థాపించబడిన సెలెబి కంపెనీ... టర్కీలో మొట్టమొదటి ప్రైవేట్ యాజమాన్యంలోని గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 70 విమానాశ్రయాలలో తన సేవలను అందిస్తున్నది. భారత్ పాకిస్థాన్ మథ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో టర్కీ పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బాయ్కాట్ టర్కీ అన్న నినాదం జోరందుకుంది. ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన సెలిబి యేవియేషన్ సంస్థ భద్రతా అనుమతిని కేంద్రం రద్దు చేయడం అంటే ముందు ముందు ఆ దేశంతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య సంబంధాలనూ రద్దు చేసేకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-shock-to-turkey-39-198154.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.