పాకిస్తాన్ తీరు ఎన్నటికీ మారదేమో?

Publish Date:Aug 19, 2015

Advertisement

 

భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకొనేందుకు నెహ్రూ నుండి మోడీ వరకు అందరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ సఫలం కాలేకపోతున్నారు. అందుకు వారి ప్రయత్నలోపం ఏమీ లేదు. వారు ఎంత చిత్తశుద్దిగా ప్రయత్నిస్తున్నా సైన్యం, ఉగ్రవాదులు పాక్ ప్రభుత్వంపై పరోక్షంగా పెత్తనం చేస్తున్న కారణంగా పాక్ ప్రభుత్వం భారత్ కు సహకరించడం లేదనేది పదేపదే రుజువవుతూనే ఉంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత భారత్-పాక్ సంబంధాలను పునరుద్దరించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేసారు. కానీ పాక్ ని మార్చడం ఆయన వల్ల కూడా కాలేదు. అయినప్పటికీ పాక్ తో సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి తన ప్రయత్నాలు మానుకోలేదు. అందుకే కొన్నిరోజుల క్రితం రష్యాలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు. మోడీ ప్రయత్నం కొంత ఫలించడంతో త్వరలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల డిల్లీలో సమావేశం జరుగబోతోంది. కానీ పాక్ ప్రభుత్వం తన తీరు ఎన్నటికీ మారబోదని మరోమారు స్పష్టం చేస్తోంది.

 

పంజాబ్, జమ్మూలలో ఉగ్రవాదుల దాడులు, కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలపై గత రెండు వారాలుగా పాక్ దళాలు బాంబుల వర్షం కురిపిస్తుండటం, పాక్ స్వాతంత్ర దినోత్సవ సనదర్భంగా ఆగస్ట్ 14న డిల్లీలో పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ గురించి అసందర్భ ప్రేలాపనలు వంటివెన్నో యధాప్రకారం జరిగిపోతూనే ఉన్నాయి. పైగా భారత్ దళాలే 78సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్ సరిహద్దు భద్రతా దళాలపై, గ్రామాలపై దాడులు చేస్తున్నాయని అబ్దుల్ బాసిత్ ప్రకటించడం మొగుడ్ని కొట్టి బజారు కెక్కినట్లుంది. ఒకవైపు శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు చర్చలకు సిద్దం అంటూనే మరో వైపు ఈవిధంగా వ్యవహరించడం కేవలం పాక్ కే చెల్లు. అయినప్పటికీ భారత్ చాలా సహనంతోవ్యవహరిస్తూ డిల్లీలో జరుగబోయే జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి సిద్దపడుతోంది.

 

పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ ఇటీవల సజీవంగా పట్టుబడటం, పంజాబ్, ఉదంపూర్ లలో ఉగ్రవాదుల దాడులు, సరిహద్దుల వద్ద కాల్పులకు ఈ సమావేశంలో పాక్ జాతీయ భద్రతా సలహాదారు తప్పనిసరిగా భారత్ కు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అది చాలా కష్టం అని పాక్ కూడా తెలుసు. అందుకే భారత్ ఈ సమావేశాన్ని కూడా తనంతట తాను ఏకపక్షంగా రద్దు చేసుకొనేలా తనకు అలవాటయిన వ్యూహాలను అమలు చేస్తోంది.

 

ఇంతకు ముందు భారత ప్రభుత్వం వారిస్తున్నా లెక్క జేయకుండా పాక్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీరీ వేర్పాటువాదులయిన హురియత్ నేతలను డిల్లీకి ఆహ్వానించి వారితో సమావేశమయ్యారు. అందుకు నిరసనగా గతేడాది ఇస్లామాబాద్ లో జరగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకొంది. కనుక కీలకమయిన ఈ సమావేశం రద్దు చేసేందుకు మళ్ళీ పాక్ హైకమీషనర్ అదే ఎత్తు వేస్తున్నారు. వచ్చే సోమవారంనాడు పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో డిల్లీలో సమావేశం కానున్నారు. దానికి ఒక్కరోజు ముందు అంటే ఆదివారంనాడు సర్తాజ్ అజీజ్ డిల్లీ చేరుకొంటారు. ఆరోజు రాత్రి ఆయనతో కాశ్మీరీ వేర్పాటు హురియత్ నేతలు సయీద్ అలీ షా గిలానీ తదితరుల విందు సమావేశం ఏర్పాటు చేసారు. ఇది భారత్ ని రెచ్చగొట్టే ప్రయత్నమేనని అర్ధమవుతోంది.

 

ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగబోతున్న సమయంలో హురియత్ వేర్పాటువాద నేతలను డిల్లీకి ఆహ్వానించడమే పెద్ద తప్పు. మళ్ళీ వారికి పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తో విందు సమావేశం ఏర్పాటు చేయడం దానికి ఆయన అంగీకరించడం అన్నీ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న తప్పులే. ఆ విధంగా భారత్ ని మళ్ళీ రెచ్చ గొట్ట గలిగితే ఈ సమావేశాన్ని భారత్ రద్దు చేసుకొంటుందని పాక్ వ్యూహంగా కనబడుతోంది. తద్వారా భారత్ అడగబోయే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన ఇబ్బందికరమయిన పరిస్థితులను తప్పించుకోవడమే కాకుండా, శాంతి ప్రయత్నాలకు తమ ప్రభుత్వం ముందుకు వస్తున్నప్పటికీ భారత్ కుంటిసాకులు చెప్పి తప్పించుకొంటోందని భారత్ ని అంతర్జాతీయ వేదికల మీద నిందించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పాక్ ఈ కీలకమయిన సమావేశాన్ని రద్దు చేసేందుకు ఆఖరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండవచ్చును.

 

పాక్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశ్యంతోనే భారత్ ఈ సమావేశానికి సిద్దపడుతుంటే, అంతర్జాతీయ సమాజం ముందు తను దోషిగా నిలబడకూదదనే ఉద్దేశ్యంతోనే పాక్ ఈ సమావేశానికి అంగీకరించింది. కానీ దానిని ఏదోవిధంగా చెడగొట్టి భారత్ పైనే ఆ నింద వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కనుక ఈ సమావేశం జరిగేలోగా సరిహద్దులలో దాడులు మరింత ఉదృతం చేయవచ్చును. లేదా భారత్ లో జొరబడిన పాక్ ఉగ్రవాదులు ఎక్కడయినా బాంబులు పేల్చ వచ్చును. లేదా సరిహద్దులలో మళ్ళీ పాక్ ఉగ్రవాదులు దాడులు చేయవచ్చును. జమ్మూలో పాక్, ఐ.యస్. జెండాలు రెపరెపలాడించవచ్చును. హురియత్ నేతలు భారత్ వ్యతిరేక ప్రసంగాలు చేయవచ్చును.

 

పాక్ సృష్టించబోయే ఇన్ని సవాళ్ళను ఎదుర్కొని ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచి వాటిని దృడ పరచాల్సిన గురుతరమయిన బాధ్యత పాక్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ మీద ఉంది. కానీ ఆయన వాటిని మరింత చెడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఆదేశాలు, సిద్దాంతాల ప్రకారమే ఆయన ఆపని చేస్తున్నాడని వేరేగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు ఈ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాలు నిర్వహించడం కూడా వ్యర్ధమే. ఒకవేళ ఈ సమావేశం జరిగినా దానిలో భారత్-పాక్ ఒకదానినొకటి నిందించుకోవడం తప్ప మరేమీ చేయలేవు. ఎందుకంటే కడుపులో లేనిదీ కావలించుకొంటే రాదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.