భారత్-పాక్ సంబంధాలు ఎందుకు మెరుగుపడటం లేదు?

Publish Date:Nov 29, 2015

Advertisement

 

భారత్ ఎప్పుడూ ఇరుగుపొరుగు దేశాలన్నిటితో శాంతి, బలమయిన స్నేహ సంబందాలే కోరుకొంది తప్ప ఏనాడూ కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నించలేదు. కానీ గత ఆరు దశాబ్దాలుగా భారత్ ఎంతగా ప్రయత్నించినా పాకిస్తాన్ తో మాత్రం సఖ్యత కుదరడం లేదు. ఒకవేళ కుదిరినా అది తాత్కాలికమే అవుతోంది. అందుకు ఇరుదేశాలు ఒక దానిని మరొకటి నిందించుకొంటున్నాయి. ఎవరి వాదనలు, కారణాలు వారికి ఉన్నాయి. ఈ వాదోపవాదాలు, ఉద్రిక్తతల మధ్యనే ఇరు దేశాలు అప్పుడప్పుడు శాంతి చర్చలు జరుపుకొంటూ మళ్ళీ గొడవపడుతూ దశాబ్దాలు దొర్లించేస్తున్నాయి. మిగిలిన ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక్క పాకిస్తాన్ తో మాత్రమే ఎందుకు సయోధ్య కుదరడం లేదు? అనే సందేహం కలగడం చాలా సహజం. అందుకు ఇరు దేశాలు చెపుతున్న కారణాలే కాక ఇంకో బలమయిన కారణం కూడా ఉంది. అదే పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు!

 

భారత్, పాక్ రెండూ ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయి. అప్పటి నుండి భారత్ లో ప్రజాస్వామ్యం నెలకొని ఉంటే, పాకిస్తాన్ లో చాలాసార్లు సైనిక పాలన సాగింది. అపుడప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ వాటిపై సైనిక పెత్తనం తప్పడం లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికారం చెలాయిస్తున్న పాక్ సైనికాధికారుల యుద్దపిపాస కారణంగా ఈ ఆరు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో పాకిస్తాన్ ఆశించినంత అభివృద్ధికి నోచుకోలేదు. సైనికాధికారుల కర్ర పెత్తనం వలన ప్రభుత్వాలు దేశాభివృద్ధి కంటే భారత్ పైనే ఎక్కువ దృష్టిపెట్టవలసి వస్తోంది. తత్ఫలితంగా దేశంలో అవినీతి, నిరుద్యోగం, దారిద్యం పెరిగాయి. భారత్ లో కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యం నెలకొని ఉండటం వలన నిరంతర అభివృద్ధి జరుగుతోంది. కనుక పరిస్థితులు ఏనాడు అదుపు తప్పలేదు.

 

ప్రభుత్వ విధానాలు, వైఖరిని బట్టే ఆ దేశంలో లేదా రాష్ట్రంలో పరిస్థితులుంటాయి. చైనాలో కమ్యూనిస్ట్ పాలన సాగుతోంది. వారికీ యుద్ద కాంక్ష చాలా ఎక్కువే. కానీ దానికంటే వారు దేశాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే అగ్రరాజ్యాలతో సమానంగా చైనా అభివృద్ధి చెందుతోంది. కానీ పాక్ అనుసరిస్తున్న తప్పుడు వైఖరి కారణంగా పాక్ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఒకవేళ పాక్ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేస్తున్న సైనికాధికారులు కూడా దేశాభివృద్ధికే ప్రాధాన్యతనిచ్చి ఉండి ఉంటే నేడు పాక్ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వారు దేశాభివృద్దిపై దృష్టి పెట్టకుండా భారత్ తో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. తత్ఫలితంగానే పాకిస్తాన్ లో మతోన్మాదం, ఉగ్రవాదం పెరిగిపోయింది.

 

శాంతికాముక దేశమయిన భారత్ ఏనాడూ యుద్ధం గురించి ఆలోచించలేదు. కానీ యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పాక్ సైనిక పాలకులు, సైనికాధికారులే భారత్ తమపై యుద్ధానికి వస్తుందని ఊహించేసుకొంటూ, ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా ఆ ఊహాజనితమయిన యుద్దవాతవరణంలో ఉంచుతున్నారు. అలాగ ఉంచినంత కాలం వారు ప్రభుత్వాలపై కర్ర పెత్తనం చేయగలరు. వారి కనుసన్నలలో ప్రభుత్వాలు నడుస్తున్నంత కాలం, అవి దైర్యంగా, స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేవు. భారత్ అందిస్తున్న స్నేహహస్తం అందుకోలేవు. అందుకే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడటంలేదు. అయినప్పటికీ నాడు జవహార్ లాల్ నెహ్రూ మొదలుకొని నేడు నరేంద్ర మోడీ వరకు అందరూ పాకిస్తాన్ కి స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.

 

భారత్-పాక్ ల మధ్య సంబంధాలు బలపడాలంటే, ముందుగా పాక్ లో నెలకొన్న ఈ పరిస్థితులు మారాలి. కానీ అది అసంభవం. కనుక భారత్-పాక్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడటం కూడా దాదాపు అసంభవమేనని భావించవచ్చును. బహుశః భారత్-పాక్ సంబంధాలు ఎప్పటికీ ఇలాగే ఉండవచ్చును లేదా ఇంకా అద్వానంగా మారినా ఆశ్చర్యం లేదు. భారత్ తో బేషరతుగా చర్చలలో పాల్గొనటానికి తాము సిద్దంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మొన్న ప్రకటించారు. కానీ భారత్ పట్ల పాక్ దృకోణం, దాని వైఖరి మారనంతవరకు ఎన్ని సార్లు చర్చించినా దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని చెప్పవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.