పాకిస్తాన్ కు మనకన్నా ఒక్క రోజు ముందే స్వతంత్రం ఎందుకొచ్చింది?

Publish Date:Aug 14, 2017

Advertisement

 
ఆగస్ట్ 15, 1947న ఏం జరిగింది? ఈ ప్రశ్నకి భారతదేశంలో ఎవరైనా ఠక్కున సమాధానం చెప్పేస్తారు! డెబ్బై ఏళ్ల కింద ఆ రోజున మనకు స్వేచ్ఛ లభించింది! కానీ, విషాదంగా, బ్రిటీష్ వెళ్లిపోయిన అదే రోజున పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెంలా తయారై కూర్చుంది! ఆగస్ట్ 15, 1947నే ఆనాటి పాకిస్తాన్ కూడా ఏర్పాటైంది! ఆ దేశ మొదటి స్వాతంత్ర దినోత్సవం కూడా అదే నాడు జరిగింది! మరి ఇప్పుడెందుకు ఆగస్ట్ 14న… ఒక్క రోజు ముందే… పాక్ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది?

 

నిజానికి… పాకిస్తాన్ ఇండియాతో పాటే… ఆగస్ట్ 15న ప్రతీ యేడూ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. కాని, తన సెకండ్ ఇండిపెండెన్స్ డే నాటి నుంచీ ఆ దేశం భారత్ కంటే ఒక్క రోజు ముందుగా వేడుకలు జరుపుకుంటోంది! దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథే వుంది!

 

1947లో మనకు స్వాతంత్రం రావటానికి ముందు… 1945 ఆగస్ట్ 15వ తేదీన జపాన్ బ్రిటీష్ వారి ముందు లొంగిపోయింది! దాంతో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసిపోయింది. అదే రోజున రెండేళ్ల తరువాత మనకు స్వతంత్రం ప్రకటించింది బ్రిటన్! ఆ దేశ అధికారిగా మన దేశంలో అప్పట్లో వున్నది మౌంట్ బ్యాటన్! వైస్రాయ్ గా వున్న ఆయన 1947లో … ఆగస్ట్ 15న జపాన్ పై బ్రిటీష్ విజయానికి సంకేతంగా జరిగిన వేడుకల్లో పాల్గొనాలని భావించాడు! అంతే కాదు, ఆగస్ట్ 15న న్యూ దిల్లీలో జరిగే భారత తొలి స్వతంత్ర వేడుకల్లోనూ పాల్గొనాలని భావించాడు! ఈ రెండు కారణాల చేత పాకిస్తాన్ కు ఒక రోజు ముందే, అంటే ఆగస్ట్ 14, 1947న స్వతంత్ర ప్రకటించేశాడు!

 

ఒక రోజు ముందే స్వేచ్ఛ లభించినా కూడా పాకిస్తాన్ 1947లో ఇండియాతో పాటే స్వతంత్ర దినోత్సవం జరుపుకుంది. ఆ రోజు రంజాన్ నెల చివరి శుక్రవారం కూడా కావటంతో ప్రపంచ వ్యాప్త ముస్లిమ్ లు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని జిన్నా పిలుపునిచ్చాడు కూడా! కాని, మరుసటి సంవత్సరం పరిస్థితి మారిపోయింది! 1948లో ఆగస్ట్ 14 రంజాన్ నెల 27వ రోజైంది! అది ముస్లిమ్ లకు ప్రత్యేక పర్వదినం! అందుకని అదే రోజున సంబరాలు చేసుకున్నారు. ఇక అప్పట్నుంచీ ఆగస్ట్ 14ననే పాక్ స్వతంత్ర వేడుకలు జరగటం పరిపాటి అయిపోయింది!

 

భారతదేశం స్వతంత్ర దినోత్సవం జరుపుకునే రోజున పాకిస్తాన్ జరుపుకోకపోపవటానికి మరో కారణం కూడా వుంది! అది ఇండియానే! మనమంటే అస్సలు పడని పాకీలు మనతో బాటూ స్వతంత్ర వేడుకలు జరుపుకోవటం సహజంగానే ఇష్టపడరు! ఒకవేళ జరుపుకున్నా ప్రపంచం దృష్టి భారత్ వైపునే వుంటుంది! అందుకే, ఒక రోజే ముందే హంగామా చేసేస్తూ వస్తున్నారు 69ఏళ్లుగా… ఇస్లామాబాద్ పాలకులు!

By
en-us Political News

  
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.