అరసవల్లిలో మంగ్లికి అనుచిత ప్రాధాన్యం.. కూటమి క్యాడర్ లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

Publish Date:Feb 5, 2025

Advertisement

జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది.  వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌లో అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు హ‌ద్దే లేకుండా పోయింది. ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారి అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలికొదిలేశాడు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది.

అదలా ఉంటే.. జగన్ విధానాలను వ్యతిరేకించిన వారినీ, తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులకు కొదవే లేదు. నిజం జగన్ అధికారం వెలగబెట్టిన ఐదేళ్లూ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలపై వేధింపులతో చెలరేగిపోయారు. ఆయన అండ చూసుకుని ఆ పార్టీ నేతలూ, అభిమానులుగా చెప్పుకున్న వారూ కూడా చెలరేగిపోయారు. 

సరే జనం జగన్ పాలనను నిర్ద్వంద్వంగా తిరస్కరించి, గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా ఆ పార్టీ తగదని తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారు. ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది.  వైసీపీ హయాంలో మంచీ చెడూ విచక్షణ లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలూ, వారి అండ చూసుకుని చెలరేగిపోయిన నేతలూ అధికారులపై తెలుగుదేశం కూటమి సర్కార్ కొరడా ఝుళిపిస్తుందనీ, వారిని చట్టంముందు నిలబెట్టి శిక్షిస్తుందనీ ఆశించిన తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా కూడా   జగన్ హయాంలో అక్రమాలు, సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోయిన ఆ పార్టీ యాక్టివిస్టులను చూసీ చూడనట్లు వదిలేస్తుండటమే ఇందుకు కారణం. అంతే కాదు వైసీపీ హయాంలో ఆ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించిన వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ రాజచమర్యాదలు పొందుతుడటంతో క్యాడర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

 వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం లభించడం.. తాజాగా రథ సప్తమి నాడు అరసవల్లిలో గాయని మంగ్లీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ప్రొటో కాల్ దర్శనానికి అనుమతించడంతో తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతోంది.

వైపీపీ హయాంలో సింగర్ మంగ్లి టీటీడీలో పదవి అనుభవించిన సంగతి తెలిసిందే. అటువంటి మంగ్లి తాజాగా అరసవెల్లి రథ సప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి వీఐపీ ప్రొటో కాల్ దర్శనం చేసుకోవడం.. మంత్రి పక్కనే నిలబడి మీడియాతో  మాట్లాడటం  తెలుగుదేశం కార్యక ర్తలకు మింగుడు పడటం లేదు.  టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మంగ్లికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇంత ప్రాధాన్యాన్నీ, గౌరవ మర్యాదలనూ ఇవ్వడమేంటంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ప్రత్యర్థుల పట్ల అవసరం లేని మెతకతనం చూపుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు మంగ్లీ విషయంలో కార్యకర్తల ఆగ్రహం ఒకింత ఇబ్బందికరమే అనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.