Publish Date:Mar 29, 2022
ఐఏఎస్ అధికారులు ప్రేమించుకోరా? ఐఏఎస్లు మతాంతర వివాహం చేసుకోరా? ఐఏఎస్ దంపతులు గొడవలు పడరా? ఐఏఎస్లు విడాకులు తీసుకోరా? ఐఏఎస్ అయితే మళ్లీ పెళ్లి చేసుకోరా? ఐఏఎస్ అయినంత మాత్రాన తనకంటే 13 ఏళ్ల పెద్దవారిని పెళ్లి చేసుకోరా? అవుతాయి. ఇవన్నీ జరుగుతాయి. జరిగాయి కూడా. అదికూడా ఒక్క ఐఏఎస్ అధికారిణి జీవితంలోనే ఇవన్నీ జరగడం మరింత ఆసక్తికరం. అందులోనూ ఆమె ఒకప్పటి సివిల్స్ టాపర్ కావడం విశేషం. ఆమే టీనా దాబి. ఒకప్పుడు తన మతం కాకున్నా.. బ్యాచ్మేట్ను లవ్ మ్యారేజ్ చేసుకొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలివగా.. రెండేళ్లలోనే అతనితో విడాకులు తీసుకొని మరింత షాక్ ఇచ్చారు. ఇప్పుడు తనకంటే 13 ఏళ్లు పెద్దవాడైన, సీనియర్ ఐఏఎస్తో సెకండ్ మ్యారేజ్కు రెడీ అవుతూ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన టీనా దబీ.. 2015లో సివిల్స్ టాపర్గా ఆమె పేరు మారుమోగిపోయింది. మొదటి ప్రయత్నంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి దళిత యువతిగా సత్తా చాటారు. సివిల్స్ సెకండ్ ర్యాంకర్గా నిలిచిన కశ్మీర్కు చెందిన అధర్ అమిర్ ఖాన్తో.. ట్రైనింగ్ సమయంలో ప్రేమలో పడింది. వాళ్లిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. హిందూ-ముస్లిం.. మతాంతర వివాహం కావడంతో అప్పట్లో వారి పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఎంత ఐఏఎస్లు అయితేనేం.. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే ఆ జంట విడిపోయింది. మనస్పర్థలతో గతేడాది వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.
సింగిల్గా మారిన టీనా దాబి.. మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. తన కంటే రెండేళ్లు సీనియర్ అయిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను టీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. కేడర్లో రెండేళ్లే సీనియర్ అయినా కూడా.. వయసులో మాత్రం ఆమె కంటే అతను 13 ఏళ్లు పెద్దవాడు కావడం ఆసక్తికరం.
వీరిద్దరూ ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రదీప్.. రాజస్థాన్లో పురాతత్వ, మ్యూజియం శాఖకు డైరెక్టర్గా ఉన్నారు. ఇటీవలే టీనా-ప్రదీప్ నిశ్చితార్థం జరిగింది. ఆ ఫొటోలను టీనా ఇన్స్టాలో షేర్ చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను 14 లక్షల మంది ఫాలో అవుతుండటంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ias-tina-dabi-second-marriage-25-133663.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.