Publish Date:Aug 29, 2020
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలోని గోషామహల్ బీజేపీఎమ్మెల్యే రాజాసింగ్ కు డిసిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో భద్రత కల్పించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న కారణంగా ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఆయన పాత గన్ మెన్ స్థానంలో ఆధునిక ఆయుధాలకు కలిగిన కమెండోలను ఏర్పాటుచేశారు. పాత బస్తీలో ఉన్న రాజాసింగ్ ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భారీ స్థాయిలో భద్రతావలయాన్ని ఏర్పాటుచేశారు.
ఎప్పుడు ప్రజల్లో ఉండే రాజాసింగ్ ఇకపై స్వేచ్ఛగా బైక్ పై తిరగవద్దని ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు బయటకు వెళ్లాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గాలింపు చర్యల్లో దొరికిన కొంతమంది వద్ద మారణాయుధాలతో పాటు రాజాసింగ్ పేరు ఉన్న జాబితా కూడా దొరికిందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇటీవల హైదరాబాదులో కొంతమంది స్లీపర్ సెల్స్ ను అదుపులోకి తీసుకున్నప్పుడు వారి వద్ద కూడా రాజాసింగ్ పేరు లభించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాయకుల పై ఉగ్రవాదులు దృష్టిసారించారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని గత కొద్దిరోజులుగా కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు కూడా చెప్తున్నాయి. ఈనెల 15న భారత స్వాతంత్ర దినోత్సవం రోజు కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి అధికారిక వెబ్ సైట్ ను కూడా హ్యాక్ చేశారు. దీనిపై ఇప్పటికే కేసు ఫైలు చేసి విచారణ చేస్తున్నారు. గతిమాలిన ఉగ్రవాదులు బిజెపి నాయకులను హతమార్చిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు రాజాసింగ్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
2013లో బిజెపి పార్టీలో చేరిన రాజాసింగ్ ఆ తర్వాత ఏడాది లోనే పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుపడి ప్రజల పక్షాన నిలబడ్డారు. దాంతో 2014లో వచ్చిన ఎన్నికల్లో గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ టికెట్ సాధించాడు. విజయం సాధించి పాతబస్తీలో పాగా వేసిన అభ్యర్థిగా గుర్తింపు పొందాడు. తిరిగి 2018 ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి కాషాయా జెండాను మరోసారి ఎగురవేశాడు.
తాజాగా తన భద్రత పెంపుపై ఆయన స్పందిస్తూ తనకు ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పాలని కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రికి, కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖలు రాస్తాను అంటున్నారు. ఉగ్రవాదుల నుంచా, స్థానిక సంస్థల నుంచా ఎవరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందో స్పష్టం చేయాలని ఆయన కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-police-increases-security-of-bjp-mla-raja-singh-39-103392.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.