Publish Date:Jan 28, 2025
గ్రేటర్ హైద్రాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన హైద్రాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవీగండం పొంచి ఉంది. సీనియర్ రాజకీయనాయకుడు కెకె కూతురు అయిన విజయలక్ష్మి పదవీకాలం ఇంకా ఉంది. అయితే జీహెచ్ ఎంసి చట్టాల ప్రకారం నాలుగేళ్లు పూర్తయితే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించాలి. వచ్చే నెల (ఫిబ్రవరి 10) నాలుగేళ్లు పూర్తి కానుంది. కాబట్టి బిఆర్ ఎస్ అవిశ్వాసం పెట్టే ప్లాన్ లో ఉంది. ఈ అవిశ్వాసాన్ని బలపరచడానికి అప్పటి మిత్రపక్షమైన ఎంఐఎం కాంగ్రెస్ చంకలో చేరడంతో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు కూడా తక్కువే. అయితే బిఆర్ఎస్ కు బిజెపి సపోర్ట్ చేయనుందని చెబుతోంది. బిఆర్ఎస్ కేవలం బిజెపి బలం మీదే ఆధారపడింది. ఒకరకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ కు బిజెపి మిత్ర పక్షమైనప్పటికీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తర్వాత ఈ రెండు పార్టీల బంధానికి బీటలు వారింది. జిహెచ్ ఎంసిలో 150 కార్పోరేటర్లకు గాను ఇద్దరు ఎమ్మెల్యేలు కావడం, మరో ఇద్దరు చనిపోవడంతో ఈ సంఖ్య 146కి పడిపోయింది. 50 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 196 మంది ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్ సీలు ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఎన్నికైన 41 మంది కార్పోరేటర్లు అసమ్మతి తీర్మానానికి సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ ఎస్ ఘోర పరాజయం తర్వాత మజ్లిక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. 2020 డిసెంబర్ లో జరిగిన జిహెచ్ ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పోరేటర్లు గద్వాల విజయలక్ష్మి, శ్రీలతా శోభన్ రెడ్డిలు మేయర్ డిప్యూటి మేయర్ పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో మారారు. వీరు కాంగ్రెస్ పార్టీలో మారడానికి మాజీ బిఆర్ఎస్ పొలిట్ బ్యురో సభ్యులైన కె. కేశవరావు ముఖ్యభూమిక వహించారు. తనకు పదవీగండం ఉందని వస్తున్న వార్తలను మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఖండించారు. ఆమెకు కాంగ్రెస్ కార్పోరేటర్లు పూర్తి మద్దతుగా నిలబడటంతో గద్వాల విజయ లక్మి పదవికి ఎటువంటి ఢోకా లేదని సమాచారం. అవిశ్వాసతీర్మానం పెట్టాలి అని భావిస్తున్న బిఆర్ఎస్ కు 42 కార్పోరేటర్లు, 29 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బిఆర్ఎస్ కుమరో 27 మంది సభ్యులు కావాలి. ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవడంతో బిఆర్ ఎస్ బిజెపి బలం మీద ఆధారపడింది. బిజెపి అధిష్టానం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మేయర్ కు పదవి గండం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-mayor-gadwala-vijayalakshmi-tenure-39-191976.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.