రాష్ట్ర విభజన సమస్యకి పరిష్కారం లేదా

Publish Date:Aug 2, 2013

Advertisement

 

ఊహిస్తున్నట్లుగానే రాష్ట్ర విభజన ప్రకటన అయితే వచ్చేసింది. ఇది కాంగ్రెస్ చరిత్రలో తీసుకొన్న అత్యంత సాహసోపేతమయిన నిర్ణయమని కూడా చెప్పవచ్చును. దానికి వ్యతిరేఖత ఉంటుందని ముందే ఊహించినప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చి ఉండటంతో, ఇంతగా ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ భావించి ఉండదు. దానికి మరో కారణం ఏమిటంటే, వైకాపా ఎదురుతిరిగినప్పటికీ, తెదేపా మాత్రం చివరి వరకు మౌనంగా ఉండటంతో ఆ పార్టీ తన లేఖకు కట్టుబడి ఉందని బహుశః కాంగ్రెస్ భావించి ఉండవచ్చును. కానీ, వైకాపా వ్యూహాత్మకంగా చేసిన రాజీనామాలతో అనంతపురంలో సమైక్యాగ్ని రగిలింది. దానితో తెదేపా నేతలు కూడా మళ్ళీ ఉద్యమం బాట పట్టక తప్పలేదు. దానికి తోడూ రాష్ట్ర విభజనకు ముందు రాయల తెలంగాణా ప్రతిపాదన చేసి అక్కడి ప్రజలను కాంగ్రేసే స్వయంగా రెచ్చగొట్టి పెద్ద తప్పు చేసింది. 

 

అయితే, రాజీనామాలు చేసి ఉద్యమాలు చేస్తున్న సీమాంధ్ర నేతలెవరూ కూడా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడకపోవడం గమనార్హం. వారందరూ విభజన ప్రక్రియలో సీమంద్రా ప్రాంతానికి న్యాయం జరగాలని, హైదరాబాద్ రాజధానిపై హక్కులు కావాలని మాత్రమే కోరుతున్నారు. వారి మొదటి డిమాండ్ పై తెలంగాణా నేతలు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ, హైదరాబాద్ పై హక్కుల విషయంలో మాత్రం ఎంత మాత్రం రాజీకి సిద్దపడటం లేదు. ఈ అంశం మొదటి నుండి ఇరుప్రాంతల నేతలు భీష్మించుకొని కూర్చొన్నసంగతి తెలిసిందే. అయితే పరిస్థితి ఇంత వరకు వచ్చిన తరువాత కూడా ఆ సమస్యను ఇప్పటికీ సామరస్యంగా పరిష్కరించుకోకపోతే రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఈ ఆవేశకావేశాలు ఎన్నటికీ చల్లారే అవకాశం ఉండదు. రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే ఉంటుంది.

 

రాష్ట్ర విభజన చేసే హక్కు ఉత్తరాదివారికీ ఎవరిచ్చారని ప్రశించిన మన రాష్ట్ర నేతలు కనీసం ఈ సారయినా అటువంటి అవకాశం వారికి ఈయకూదదని నిజంగా భావిస్తే రాజకీయాలకి అతీతంగా రెండు ప్రాంతాలకు చెందిన మేధావులను సమావేశపరచి ఈ చిక్కు ముడులు ఏవిధంగా విప్పగలరో ఆలోచనలు చేయాలి. హైదరాబాద్ పై ఇటు సీమంధ్ర నేతలకి, ప్రజలకి ఎన్ని అనుమానాలున్నాయో, అవతలివైపు వారికి అన్నేఉన్నాయి. అందువల్ల  ఇటువంటి ఉద్రిక్త వాతావరణంలో ఒకరిపై మరొకరికి అనుమానాలున్న తరుణంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా కొంత కాలం ఉంచి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏర్పడేలోగా సమస్యను పరిష్కరించుకోవాలనే నిర్దిష్ట గడువుతో చర్చలు మొదలుపెడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలుంటాయి.

 

అయితే, హైదరాబాదును  కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే స్థానిక నేతలు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండదు. గనుకనే వారు ఆ ప్రతిపాదనను వ్యతిరేఖిస్తున్నట్లు భావించవచ్చును. అయితే ఎప్పుడు ప్రజలనే త్యాగాలు, ఉద్యమాలు చేయమని అడిగే నేతలు ఇటువంటి సమయంలో అవసరమయితే రాష్ట్ర హితాన్ని దృష్టిలో ఉంచుకొని వారు కూడా కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉంది. 

 

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే అటు తెలంగాణా, ఇటు సీమంధ్ర నేతలకి ఇద్దరికీ కూడా దానిపై ఎటువంటి అధికారం, హక్కులు ఉండవు. చర్చలకు శాంతి యుత వాతావరణం ఏర్పరచడం చాల అవసరం. గనుక  హైదరాబాద్ ను కేంద్రం అధీనంలో ఉంచి సానుకూల వాతావరణంలో చర్చలు మొదలుపెడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.

 

తెలంగాణా నేతలు వారుకోరుకొన్న విధంగా తెలంగాణా రాష్ట్రం సాధించుకొన్నారు గనుక, రెండు రాష్ట్రాల పునర్నిమాణం చకచకా జరగాలంటే, ఇరు ప్రాంతాల నేతలు కొంచెం పట్టు విడుపులు ప్రదర్శించాల్సిన అవసరముంది. లేకుంటే వారికి రాష్ట్రం ఏర్పడిందనే ముచ్చట ఉండదు. సీమంధ్ర ప్రజలకు సుఖశాంతులుండవు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.