తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన. ప్రస్తుతం ఫలితం ఉత్కంఠగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్న ఈవీఎంలను అభ్యర్థులు , ఏజెంట్ల సమక్షంలో విప్పబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో 86 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 36 వేల మంది కాగా.. 2 లక్షల ఐదు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం బ్యాలెట్లను 22 రౌండ్లుగా లెక్కించబోతున్నారు. ఇందుకోసం ఇక్కడ రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు . ఏడు టేబుళ్ల చొప్పున రెండు చోట్ల కలిపి 14 టేబుళ్లను సిద్ధం చేశారు . ప్రతి రౌండ్లో ఈ 14 టేబుళ్ల వద్ద ఏకకాలంలో ఓట్ల తీర్పుని బయటకు తీయనున్నారు.
ఉదయం 6 గంటలకే అభ్యర్థుల తరఫున ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు . 8.30 నిమిషాల నుంచి ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. బరిలో ఉన్న 30 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వారికి టేబుల్ వారీగా నమోదు చేసి ఎన్నికల అధికారి అనుమతి పొందిన తరువాతనే రౌండ్ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇలా ఒక్కో రౌండ్కు ఎంతలేదన్నా 30 నిమిషాల సమయం పట్టనుంది. దీంతో తుది ఫలితం వచ్చే సరికి మాత్రం సాయంత్రం కానుంది . గత ఎన్నికలకన్నా ఎక్కువగా అభ్యర్థులుండటం వల్ల లెక్కింపు ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్లను లెక్కిస్తారు. తరువాత వీణవంక , జమ్మికుంట , ఇల్లందకుంట , కమలాపూర్ మండలాల పోలింగ్ బూత్ల ఓట్లను లెక్కించనున్నారు. చివరగా కమలాపూర్ మండలంలోని గ్రామాలతో ప్రక్రియ ముగియనుంది.ఈ ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదు కాగా.. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంటలో 67.13 శాతం నమోదైంది.
స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణతోపాటు ఎవరిని కూడా వీటి దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. వెల్లడించే ఫలితాల ప్రక్రియలో భాగంగా ప్రతి రౌండు అవసరమైన ఈవీఎం యంత్రాల్ని వీవీప్యాట్లను లెక్కింపు ప్రాంతానికి తరలించేలా ప్రతి రౌండ్కు కొంతమంది సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశారు . ఇలా అధికారుల పర్యవేక్షణలో తీసుకొచ్చినవాటిని యథావిధిగా లెక్కింపు తరువాత కూడా పక్కా పర్యవేక్షణలో వాటిని భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు .
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huzurabad-bypoll-counting-create-political-heat-in-telugu-states-39-125658.html
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.