ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిపోయిన హుస్సేన్ సాగర్ నీటిమట్టం
Publish Date:Sep 2, 2024
Advertisement
భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదతో పాటు బంజారాహిల్స్, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచీ కూడా భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిపోయింది. దీంతో నీటిని మూసీలోనికి వదులుతున్నారు. దీంతో మూసీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ పూర్తి స్టాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం ఆ స్థాయి దాటి 513. 43 మీటర్లుగా ఉంది. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అధికార యంత్రాంగం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/hussanin-sagar-water-level-crossed-ftl-39-184075.html





