వైసీపీ ఓట్లకు కాంగ్రెస్ గండి... శ్రీకాకుళం ఎంపీగా కింజారపు విజయం నల్లేరు మీద బండి నడకే!

Publish Date:May 17, 2024

Advertisement

శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది.  దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి వీచిన సమయంలో కూడా ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్ సభ స్థానంతో పాటు.. టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం ఖాతాలో పడ్డాయి. ఇదే నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న విశ్వాసాన్ని కింజారపు వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఈ సారి ఎలాగైనా కింజారపును ఓడించాలన్న లక్ష్యంతో జగన్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న కలింగ సమాజిక వర్గానికి చెందిన పెరడ తిలక్ ను శ్రీకాకుళం నుంచి వైపీపీ అభ్యర్థిగా పోటీలో దించారు. ఈ పేరాడ తిలక్ గత ఎన్నికలలో టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడి చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ సారి జగన్ ఆయనను శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే  ఇక్కడ నుంచి కాంగ్రెస్  అభ్యర్థిగా కళింగ సామాజిక వర్గానికే చెందిన పేరాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఆ సమాజికవర్గ ఓట్లు భారీగా చీలిపోచే అవకాశాలున్నాయి.

అలాగే వైసీపీ నుంచి  శ్రీకాకుళం ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి   కిల్లి కృపారాణి సీటు దక్కక పోవడంతో  సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. కిల్లి కృపారాణి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  దీంతో ఆమె టెక్కలిలో వైసీపీ ఓట్లకు బారీగా గండి కొడతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అలాగే ఇంత కాలం వైసీపీకి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు కూడా వైసీపీకి దూరమైన పరిస్థితి కనిపిస్తోందనీ, దీంతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజవర్గంలో వార్ వన్ సైడ్ గా కింజారపు రామ్మోహన్ నాయడికి సానుకూలంగా మారిపోయిందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.   అంతే కాకుండా పలువురు వైసీపీ మద్దతుదారులు కూడా వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  మొత్తం మీద వైసీపీ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చే అవకాశాలున్నాయని అంటున్నారు.  

By
en-us Political News

  
సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. జూన్ 4న ఫలితాలు అధికారికంగా వెలువడతాయి. అయితే ప్రజా నాడి ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకూ దోహదం చేస్తాయి.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ సొంతంగా 95 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొంది.
ఏపీ లోక్‌సభ సర్వే మరింత విస్తారంగా...
లోక్‌సభ స్థానాల్లోనూ వైసీపీకి పెద్ద దెబ్బ
ఏపీలో ఎవ‌రు గెల‌వ‌బోతున్నారు. తెలుగుదేశం కూట‌మి అధికారంలోకి రాబోతోందా? మ‌రో సారి వైసీపీ అధికార పీఠాన్ని ద‌క్కించుకోబోతుందా? ఒక‌వేళ తెలుగుదేశం కూట‌మి గెలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్ర‌ముఖ‌ రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న‌ట్లు వైసీపీకి ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌దా?
ap parliment Exit polls, exit poll, ap exit polls, andhra pradesh elections 2024, ap elections 2024, exit poll, pre poll survey
కూటమిదే భారీ విజయం: జనగళం
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం హవానే సూచిస్తున్నాయి. దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ముందుగా పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమికి 125 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయి.
టీడీపీ కూటమికే ఘన విజయం దక్కనుందని రైస్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. తెలుగుదేశం కూటమికి 113 నుంచి 122 సీట్లు వస్తాయిని, వైసీపీకి 48 నుంచి 60 సీట్లు వస్తాయని, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం వుందని రైస్  సర్వే వెల్లడించింది.
కేకే సర్వే కూడా కూటమి వైపే.. వైసీపీకి 14 సీట్లే!
కూటమిదే ఘన విజయం: పీపుల్స్ పల్స్ సర్వే
ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి దాదాపు ఇర‌వై రోజులు కావొస్తున్నది. ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి మేమే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని తెలుగుదేశం, వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోసారి జ‌గ‌న్ సీఎం అవుతార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. పోలింగ్ స‌ర‌ళిని చూస్తే అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావ‌టంతో ప్ర‌జ‌లు విసిగిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.