మీకూ  శ్వాస సమస్యలున్నాయా? దీపావళి సీజన్ లో ఈ జాగ్రత్తలు  పాటించండి!

Publish Date:Nov 8, 2023

Advertisement

 

దీపావళి అంటే చిన్నా పెద్ద అందరికీ చాలా ఇష్టం.  ఈ పండుగ రోజున పెద్దలు కూడా చిన్నపిల్లలలై తమ పిల్లలతో కలసిపోతారు. ఒకప్పుడు దీపావళి అంటే ఇల్లంతా దీపాలు పెట్టడం, కాసిన్ని టపాసులు పేల్చడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. కేవలం దీపావళి మాత్రమే కాదు శుభకార్యాలు, జాతరలు, ఉత్సవాలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లు, రాజకీయనాయకుల రాక, సినీతారల రాక ఇలా చాలా సందర్బాలలో  బాణసంచా పెద్ద ఎత్తున కాలుస్తారు. కాలం గడిచే కొద్దీ వాహనాల రద్దీ ఎక్కువ కావడం, వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. దీనికారణంగా గతంతో పోలిస్తే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. ఇక దేశం అంతా పెద్ద ఎత్తున జరుపుకునే దీపావళి నాడు బాణసంచా చాలా ఎక్కువగానే కాలుస్తారు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

శ్వాస సంబంధ సమస్యల ముప్పు..

ఇప్పటికే ఆస్తమా, ఊపిరితిత్తుల బలహీనత, ఇతర శ్వాస సంబంధ సమస్యలు ఉంటే దీపావళి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  బాణసంచా కాల్చినప్పుడు వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, చిన్న రేణువులతో కూడిన అనేక హానికరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఇవి గాలిని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాసకోశ  వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే శ్వాస సంబంధ సమస్యలున్నవారు  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పొగకు దూరం ఉండాలి.

ముందు చూపు..

ఆస్తమా, శ్వాస కోశ సమస్యలున్నప్పుడు  చాలామంది ఇన్ హేలర్ ఉపయోగిస్తుంటారు. బాణసంచా పొగ, వాతావరణ కాలుష్యం మొదలైనవి ఎక్కువగా ఉండే ఈ సమయంలో బయట ఉన్నప్పుడు, అందరిలో సందడిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి సమస్యలు ఎదురయ్యే అవకాసశం  ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా  ఇన్ హేలర్ ను వెంట ఉంచుకోవాలి.  శ్వాస సమస్యలు ఏర్పడినప్పుడు ఇన్ హేలర్ లు చాలా గొప్పగా సహాయపడతాయి.

మాస్క్..

కరోనా వచ్చినప్పటి నుండి మాస్క్ వినియోగం పెరిగింది. ఆ మాస్క్ లు అంటువ్యాధుల నుండే కాదు విపరీతమైన వాయు కాలుష్యం నుండి కూడా కాపాడుతాయి. దీపావళి బాణసంచా ప్రభావం నుండి రక్షణ కావాలి అంటే మాస్క్ ధరించడం చాలా మంచిది. ఇది శ్వాసకోశ సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తుంది.

బయటకు వెళ్లొద్దు..

ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు బాధిస్తుంటే దీపావళి బాణసంచా కాల్చే సమయంలో అసలు బయటకు వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు. ఇంట్లో కూడా గాలి వెలుతురు బాగా ఉండేలానూ, గాలి కాలుష్యం అరికట్టడానికి ఎయిర్ ప్యూరిపైయర్లు, గాలి కాలుష్యాన్ని అరికట్టే ఇండోర్ మొక్కలు వంటివి  పెంచుకోవాలి. దీనివల్ల సమస్యను అరికట్టచ్చు.  ఒక వేళ బయటకు తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తో వెళ్లాలి, అలాగే వెంట ఇన్ హేలర్ ఉంచుకోవాలి.

                              *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.