మనస్సు స్వాధీనంలో ఉండటం ఎందుకు అవసరమో తెలుసా?

Publish Date:Aug 26, 2025

Advertisement

మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనసు నియంత్రణలో లేకపోతే ఏ పనినీ సంపూర్ణంగా చేయలేరు. అదే మనసు నియంత్రణలో ఉంటే గొప్ప కార్యాలను కూడా సులువుగా చేసే శక్తి వస్తుంది. 


మనస్సు స్వాధీనంలో లేనివాడు మనశ్శాంతిని పొందలేడు. మనశ్శాంతి లేనివాడు ఆనందంగా ఎలా ఉండగలడు? బలమైన కోరికలు, ఉద్రేకాలు, ఒత్తిళ్ళతో బాధపడే వ్యక్తి దీర్ఘ మానసిక వ్యాధులకు గురవుతాడు. మనస్సు స్వాధీనమైతే కలిగే ఫలితమే.. సమగ్ర వ్యక్తిత్వ వికాసం. అలాంటి వ్యక్తి ప్రతికూల పరిస్థితులలో కూడా  విజయం సాధిస్తాడు. ప్రశాంతంగా ఉండేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండే వ్యక్తి ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలుగుతాడు. సంతోషంగా ఉండేవారు చేపట్టిన పనిలో నాణ్యతను ప్రదర్శిస్తారు. అయితే, దీనికి అర్థం  అలాంటి వారి జీవితంలో ఎలాంటి చీకూచింతలూ ఉండవని కాదు. కానీ అలాంటి వారు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. ఎదురైన కష్టాల్నీ, సమస్యల్నీ విజయానికి సోపానాలుగా మలచుకుంటాడు. వాటివల్ల జీవితంలో  మరింత గొప్పగా రాణించగలుగుతారు. అలాంటి వ్యక్తిని, వ్యక్తులను సమాజం ఒక ఆదర్శపురుషునిగా కొనియాడుతుంది.

ఇకపోతే.. 'ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు? అనే ప్రశ్న చాలామందిలో నిరంతరం మెదులుతూ ఉంటుంది. మనస్సును ఎవరు జయిస్తారో వారే! ప్రపంచాన్ని జయించగల సామర్థ్యం కలిగి ఉంటారు. 

ప్రగతి, అభివృద్ధి, ప్రశాంతత వీటిని  ఏ రంగంలో  సాధించాలన్నా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం. మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేని జాతి తన అభివృద్ధిని నిలుపుకోలేదు. మనిషి మనసును నియంత్రణలో పెట్టుకోవడం అనే గొప్ప స్థాయిని చేరగలడు. అందుకే మనిషి అన్ని జీవజాతులలోకి గొప్ప వాడిగా ఉండగలుగుతున్నాడు. 

అయితే మన ప్రగతికి అవసరమైనది బలమైన సంకల్పశక్తి కలిగి ఉండడమే. ఆ శక్తిని సాధించ లేకపోతే అధోగతి పాలవుతామన్న విషయాన్ని మన మనస్సుకు పదేపదే చెప్పాలి. మనస్సుని స్వాధీనపరుచుకున్నామా లేదా అన్న ఒక్క సత్యం మీదే మన భవిష్యత్తు అంతా ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని మనకు మనమే స్పష్టంగా తెలియజెప్పుకోవాలి. కనీస అవసరాలు తీరిన తరువాత మనిషికి ఇతర విషయాలు ముఖ్యంగా అనిపించే అవకాశం ఉంది. చాలామంది విషయంలో జరిగేది ఇదే. అవసరాలు ఒక్కొక్కటిగా పెరుగుతూ పోతుంటాయి. అవసరం లేనివి కూడా అవసరమే ఉద్దేశ్యంలోకి జారుకుంటారు. కానీ జీవితపు సర్వోత్కృష్ట లక్ష్యమైన జ్ఞానోదయాన్నీ, దైవ సాక్షాత్కారాన్నీ పొందాలనుకుంటే మనస్సును స్వాధీనపరుచుకోవడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు.

ఒకసారి  ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుని, దృఢంగా నమ్మగలిగితే మనిషి సంకల్పశక్తి అవసరమైనంత బలాన్ని పుంజుకుంటుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాంటి ప్రశాంత మనసుతో ఏ కార్యాన్నైనా సాధించవచ్చు.


                                          *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి...
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు...
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.