Publish Date:Dec 30, 2024
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగిసింది. ఆయన అరెస్టు కావడం అనివార్యంగా కనిపిస్తోంది. కేటీఆర్ అరెస్టైతే పరిస్ధితి ఏమిటి? అందరూ అనుకుంటున్నట్లుగా హరీష్ ఇక పార్టీపై పూర్తి పెత్తనం తీసుకుంటారా? లేక దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా కనిపిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా? లేక.. ఇటీవలి కాలంలో కొద్దిగా చురుకుగా కనిపిస్తున్న కవిత పార్టీపై పట్టు సాధిస్తారా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నాయి.
అయితే దానిని పక్కన పెడితే ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించి ఫార్ములా-ఇ రేసింగ్ కోసం చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మాజీ మంత్రి కె. తారక రామారావుకు సమన్లు జారీ చేసింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనవరి 7న విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంతలో, కెటిఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. దాని కంటే ముందు అంటే మంగళవారం (డిసెంబర్ 31)తో కేటీఆర్ కు కోర్టు ఇచ్చిన అరెస్టు నుంచి మినహాయింపు ముగుస్తుంది. కోర్టు కేటీఆర్ పై కేసును క్వాష్ చేయకుంటే ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రాష్ట్రం అట్టుడికిపోతుందా? ఆందోళనలు మిన్నంటే అవకాశం ఉందా? క్వాష్ కేసులో చంద్రబాబును అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహంలా కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా ప్రజలు స్పందిస్తారా? అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. కెటిఆర్ విషయంలో ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం లేదన్న భావనే పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతోంది.
కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విషయంలో సొమ్ముల బదలాయింపుతో తనకు సంబంధం లేదని టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకువచ్చి అధికారులను బలిపశువులను చేసైనా తాను బయటపడాలని భావిస్తున్నారు. అంతే తప్ప అక్రమంగా సొమ్ముల బదలాయింపు జరగలేదని చెప్పడం లేదు. అన్నిటికీ మించి తాను అరెస్టు కావడం ఖాయమన్న భావనలో ఆయన ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అవగతమౌతున్నది. దీంతో ఆయన ప్రజల సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే చంద్రబాబు విషయంలో జరిగింది వేరు. ఆయనను అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి అరెస్టు చేశారు. అరెస్టుకు కారణాలు కూడా చూపలేదు. అరెస్టు చేసిన తరువాత స్కిల్ కేసులో ఆయన పేరు చార్జిషీట్ లో పెట్టారు. అన్నిటికీ మించి చంద్రబాబు స్కిల్ విషయంలో ఎలాంటి తప్పూ జరగలేదన్న వాదనకే నిలబడ్డారు. అయితే కేసీఆర్ తప్పు జరగలేదని గట్టిగా చెప్పడం లేదు. తప్పు జరిగిందనీ, అయితే ఆ తప్పుకు తాను బాధ్యుడిని కాననీ చెప్పుకుంటున్నారు.
ఇక్కడ గతంలో కవితను ఈడీ అరెస్టు చేసినప్పుడు కూడా ప్రజల నుంచే కాదు, పార్టీ కార్యకర్తల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆమె అరెస్టు కూడా అనూహ్యంగా ప్రాపర్ విచారణ లేకుండా జరగలేదు. నోటీసులు ఇచ్చారు. పలు మార్లు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏసీబీ, ఈడీలు ఆయనకు నోటీసులు ఇచ్చాయి. సోమ్ము అక్రమ తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతున్నది. దీంతో కేటీఆర్ అరెస్టు విషయంలో నిరసనలు వ్యక్తమైనా అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేంత స్థాయిలో ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/how-telangana-react-if-ktr-arrest-25-190510.html
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.