Publish Date:Dec 30, 2024
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కు ఉచ్చు బిగిసింది. ఆయన అరెస్టు కావడం అనివార్యంగా కనిపిస్తోంది. కేటీఆర్ అరెస్టైతే పరిస్ధితి ఏమిటి? అందరూ అనుకుంటున్నట్లుగా హరీష్ ఇక పార్టీపై పూర్తి పెత్తనం తీసుకుంటారా? లేక దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా కనిపిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారా? లేక.. ఇటీవలి కాలంలో కొద్దిగా చురుకుగా కనిపిస్తున్న కవిత పార్టీపై పట్టు సాధిస్తారా? అన్న ప్రశ్నలు తెలంగాణ రాజకీయాలలో గట్టిగా వినిపిస్తున్నాయి.
అయితే దానిని పక్కన పెడితే ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించి ఫార్ములా-ఇ రేసింగ్ కోసం చెల్లింపులు జరిపిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మాజీ మంత్రి కె. తారక రామారావుకు సమన్లు జారీ చేసింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జనవరి 7న విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంతలో, కెటిఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. దాని కంటే ముందు అంటే మంగళవారం (డిసెంబర్ 31)తో కేటీఆర్ కు కోర్టు ఇచ్చిన అరెస్టు నుంచి మినహాయింపు ముగుస్తుంది. కోర్టు కేటీఆర్ పై కేసును క్వాష్ చేయకుంటే ఏసీబీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రాష్ట్రం అట్టుడికిపోతుందా? ఆందోళనలు మిన్నంటే అవకాశం ఉందా? క్వాష్ కేసులో చంద్రబాబును అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ఉవ్వెత్తున ఎగసిన ప్రజాగ్రహంలా కేటీఆర్ ను అరెస్టు చేస్తే కూడా ప్రజలు స్పందిస్తారా? అన్న ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. కెటిఆర్ విషయంలో ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన వచ్చే అవకాశం లేదన్న భావనే పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతోంది.
కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విషయంలో సొమ్ముల బదలాయింపుతో తనకు సంబంధం లేదని టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకువచ్చి అధికారులను బలిపశువులను చేసైనా తాను బయటపడాలని భావిస్తున్నారు. అంతే తప్ప అక్రమంగా సొమ్ముల బదలాయింపు జరగలేదని చెప్పడం లేదు. అన్నిటికీ మించి తాను అరెస్టు కావడం ఖాయమన్న భావనలో ఆయన ఉన్నట్లు ఆయన మాటలను బట్టి అవగతమౌతున్నది. దీంతో ఆయన ప్రజల సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే చంద్రబాబు విషయంలో జరిగింది వేరు. ఆయనను అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్థరాత్రి అరెస్టు చేశారు. అరెస్టుకు కారణాలు కూడా చూపలేదు. అరెస్టు చేసిన తరువాత స్కిల్ కేసులో ఆయన పేరు చార్జిషీట్ లో పెట్టారు. అన్నిటికీ మించి చంద్రబాబు స్కిల్ విషయంలో ఎలాంటి తప్పూ జరగలేదన్న వాదనకే నిలబడ్డారు. అయితే కేసీఆర్ తప్పు జరగలేదని గట్టిగా చెప్పడం లేదు. తప్పు జరిగిందనీ, అయితే ఆ తప్పుకు తాను బాధ్యుడిని కాననీ చెప్పుకుంటున్నారు.
ఇక్కడ గతంలో కవితను ఈడీ అరెస్టు చేసినప్పుడు కూడా ప్రజల నుంచే కాదు, పార్టీ కార్యకర్తల నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆమె అరెస్టు కూడా అనూహ్యంగా ప్రాపర్ విచారణ లేకుండా జరగలేదు. నోటీసులు ఇచ్చారు. పలు మార్లు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏసీబీ, ఈడీలు ఆయనకు నోటీసులు ఇచ్చాయి. సోమ్ము అక్రమ తరలింపునకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీంతో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతున్నది. దీంతో కేటీఆర్ అరెస్టు విషయంలో నిరసనలు వ్యక్తమైనా అవి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేంత స్థాయిలో ఉండే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/how-telangana-react-if-ktr-arrest-25-190510.html
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.