సిగరెట్ తాగేవారికి పిల్లలు పుట్టరా? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

Publish Date:Oct 7, 2023

Advertisement

ప్రతి మనిషి జీవితంలోనూ పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ బోలెడు దశలు మారతాయి.  పుట్టిన వాడు పెరగక మానడు, పెరిగిన వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనక మానడు. కానీ ఇప్పటి కాలంలో చాలామంది మగవారు పిల్లలను కనడంలో ఫెయిల్ అవుతున్నారు. నిజానికి ఈ సమాజంలో ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే ఎన్నెన్నో మాటలు అంటారు. అదే లోపం మగవాడిలో ఉంటే  అతన్ని కూడా పనికిరాడు అనే మాటను నిర్దాక్షిణ్యంగా అనేస్తుంటారు.  మగవారిలో పిల్లలు కలగడానికి తగిన సామర్థ్యం లేదంటే అది వీర్యకణాల లోపంగా పరిణిస్తారు.  చాలామంది సరదా కోసం, ఫ్యాషన్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి చేసే ధూమపానం  పిల్లలు కలగకపోవడానికి ఒక ప్రధానకారణం అవుతుందనే విషయం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది.  అసలు ధూమపానం మగవారిలో సంతానం కలగకుండా ఉండటానికి ఎలా కారణం అవుతుంది? దీని ప్రభావం ఎంత? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే..

పరిశోధనలు ఏం చెప్పాయంటే..

మగవారిలో ఆరోగ్యకరమైన వీర్యం, వీర్యంలో శుక్రకణాల  సంఖ్య, ఆ శుక్రకణాల కదలిక, వీర్యం చిక్కదనం మొదలైన విషయాలపై మగవారిలో పిల్లలను కనే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.  సంతానోత్పత్తిపై ధూమపానం కలిగించే ప్రభావం గురించి 2016లో జరిగిన ఒక పరిశోధనలో పొగాకు స్పెర్మ్ కౌంట్ ను దారుణంగా దెబ్బతీస్తుందని తెలిసింది. ధూమపానం చేసేవారి  వీర్యంలోని  శుక్రకణాలు అండాలను చేరుకుని ఫలదీకరణం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ధూమపానం ఎక్కువగా చేసేవారు తమ భాగస్వామితో సంభోగం చేసే సమయంలో అంగస్థంభన విషయంలో చాలా పేలవంగా ఉంటారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  ధూమపానం వల్ల శరీరంలో కలిగే ఆక్సీకణ ఒత్తిడి, తద్వారా ధమనుల పనితీరు మందగించడం వంటి ఇతర కారణాలు కూడా  సంభోగ సమయంలో అంగస్థంభన వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ధూమపానం అలవాటున్నవారు సంభోగం విషయంలో అసంతృప్తిని ఎదుర్కొంటుంటారు.  

ఇద్దరికీ నష్టమే..

ధూమపానం చేసేవారు కేవలం వారు మాత్రమే నష్టపోరు. వారి జీవిత భాగస్వాములు కూడా నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ధూమపానం చేయడమే కాదు, ఇతరులు ధూమపానం చేసినప్పుడు ఆ పొగను పీల్చడం కూడా దాదాపు అలాంటి నష్టాన్నే కలిగిస్తుంది. అంటే మగవారు ధూమపానం చేస్తే దానికారణంగా ఆడవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇలా పిల్లలను కనలేకపోవడమే కాదు, పిల్లలు కలగడానికి తీసుకునే వివిధ రకాల చికిత్సలు కూడా ధూమపానం చేసేవారికి సమర్థవంతమైన ఫలితాలు ఇవ్వవు.  అందుకే ధూమపానం చేసే అలవాటు ఉంటే అది పిల్లలు  కలగడంలో దాని ప్రభావాన్ని చూపించకముందే దాన్నిమానేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నించేవారు తప్పనిసరిగా ధూమపానం మానేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్య కూడా పొంచి ఉంది..

ధూమపానం చేసేవారిలో COPD అనే సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తుల నుండి వాయు ప్రసరణకు ఆటంకం కలిగించే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, శ్లేష్మం  ఉత్పత్తి,  ఊపిరితీసుకునేటప్పుడు  గురక వంటి లక్షణాలు ఇందులో  ఉంటాయి.  COPD ఉన్న వ్యక్తులలో  గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్  తో పాటు అనేక ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

                                                   *నిశ్శబ్ద.

By
en-us Political News

  
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.