కొరివితో తల గోక్కొంటున్న షిండే గారు!

Publish Date:Mar 12, 2013

Advertisement

 

హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే గతంలో రెండు మూడు సార్లు అనవసరంగా నోరు జారి తానూ ఇబ్బందులలో పడటమే కాకుండా, తన కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టారు. ఆయన చేసిన ‘నెల రోజుల్లో తెలంగాణా’ వాగ్దానం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులకు గురయిందో అందరికీ తెలిసిందే. చివరికి గులంనబీ ఆజాద్ కలుగజేసుకొని ‘నెలంటే ముప్పై రోజులు కాదు’ అని ఒక కొత్త భాష్యం చెప్పి కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేసాడు మాహానుభావుడు. నాటి నుండి తెలంగాణా విషయంలో నిశ్చింతగా కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి షిండే మళ్ళీ తన సరికొత్త వ్యాక్యలతో తలనొప్పులు తెచ్చిపెట్టారు.

 

తెరాస తదితర తెలంగాణా వాదులు ఎన్నికల సీజన్ వచ్చినందున తెలంగాణా అంశాన్ని పక్కన బెట్టడంతో రాష్ట్రంలో బయట వాతావరణంతో బాటు రాజకీయ వాతావరణం కూడా చాలబడి బాగా ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోష పడుతుంటే, హోం మంత్రి షిండేగారు తెలంగాణా పై మళ్ళీ అనవసరంగా నోరు విప్పి అగ్గి రాజేశారు.

 

“నేను నెలరోజుల్లో తెలంగాణా ప్రకటిస్తానని ఎన్నడూ, ఎవరితోను చెప్పలేదు. కేవలం నెల రోజుల్లో తెలంగాణా అంశంపై నా నివేదిక ఇస్తానని మాత్రమే చెప్పాను. చెప్పిన మాట ప్రకారమే నా నివేదికను కేంద్రానికి అందజేసాను. ప్రస్తుతం దాని మీదే చర్చ జరుగుతోంది. అయినా, తెలంగాణా అంశం ఇప్పటికిప్పుడు తేల్చే విషయం కాదు. తెలంగాణా ఇచ్చినట్లయితే, దేశంలో విదర్భవంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండులు చాలా తలెత్తుతాయి. అందువల్ల నిర్ణయం తీసుకోవాలన్నాకూడా దేశంవ్యాప్తంగా ఏర్పడే పరిస్థితులను పరిగానణలోకి తీసుకొనే నిర్ణయం చేయవలసి ఉంటుంది”అని అన్నారు.

 

ఆయన ఈ విధంగా పనిగట్టుకొని మరీ తెలంగాణా వాదులను రెచ్చగొట్టి కోరుండి కొరివితో తల ఎందుకు గోక్కోవాలని ప్రయత్నిస్తున్నారో తెలియదు. ఈవిధంగా అప్రస్తుత ప్రసంగం చేసి కాంగ్రెస్ తెలంగాణాకు వ్యతిరేఖం అని ఆయనే స్వయంగా చాటింపు వేసుకోన్నట్లు అవుతుంది. కేంద్రంలో ఉన్న ఆయనకు తెలంగాణా వాదులనుండి కొత్తగా వచ్చే ఇబ్బందులేవీ లేకపోవచ్చును, కానీ, ఆయన చేస్తున్న ఇటువంటి ప్రకటనల వల్ల తెలంగాణా కాంగ్రెస్ వాదుల గుండెల్లో మాత్రం రైళ్ళు పరిగెట్టిస్తుంటాయి. స్థానికంగా ఉండే వారికి ఆయన మాటలు కొత్త సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

 

ప్రస్తుతం తెలంగాణా కావాలని ఎవరూ ఆయన వెంటబడటం లేదు. తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీతో పోరాటాలు చేసి చేసి అలిసిపోయున్న తెరాస కూడా ఇక ఎన్నికలే శరణ్యం అని భావిస్తూ, ఎన్నికలకి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతుంటే, ఇటువంటి సమయంలో షిండేగారు ఈ అనవసరమయిన ప్రకటనలు చేయడం ఎంత మాత్రం సబబు కాదు. తద్వారా రాష్ట్రంలో అయన పార్టీకే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.